ఉప్పెన సినిమా కథను.. వినకుండానే రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

praveen
సుప్రీం హీరో సాయి ధరంతేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన సినిమా ఉప్పెన. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో అటు కృతి శెట్టి కూడా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది అన్న విషయం తెలిసిందే. అయితే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సాధించింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా హిట్ తర్వాత కృతిశెట్టి వరుస అవకాశాలు అందుకుంటూ ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా మారిపోయింది. గత కొంతకాలం నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో కృతి శెట్టి పేరు మారుమోగిపోతుంది అని చెప్పాలి.

 అయితే ఇక అటు వైష్ణవ్ తేజ్ మాత్రం ఉప్పెన సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ.. అతని మాత్రం ఖాతాలో హిట్ వేసుకోలేకపోతున్నాడు అని చెప్పాలి.  అయితే ఇక ఉప్పెన సినిమాలో ఆసీ పాత్రలో వైష్ణవ్ తేజ్ నటన అద్భుతం అని చెప్పాలి. మొదటి సినిమా అయినప్పటికీ తన హావా భావాలతో పాత్రకు ప్రాణం పోశాడు. అయితే దర్శకుడు బుచ్చిబాబు ముందుగా ఈ కథ రాసుకున్నప్పుడు హీరోగా వైష్ణవ్ తేజ్ ని  అనుకోలేదట. ముందుగా ఈ కథ సిద్ధం చేసుకున్నప్పుడు న్యాచురల్ స్టార్ నాని అయితే హీరోగా బాగా సెట్ అవుతాడని బుచ్చిబాబు భావించాడట.

 కానీ ఈ విషయంలో మాత్రం బుచ్చి బాబుకు చేదు అనుభవం ఎదురయిందట. ఉప్పెన కథను వినిపించాలని ఎంతో ఆశగా నాని ఇంటికి వెళ్ళాడట బుజ్జిబాబు. అయితే అప్పటికే ఫుల్ కాల్ షీట్స్ తో బిజీ బిజీగా ఉన్నాడట నానీ. దీంతో ఇక బుచ్చిబాబు కథ అసలు ఎలా ఉందో కూడా వినకుండానే నాని ఇక ఉప్పెన కథను రిజెక్ట్ చేశాడట.  ఇక ఆ తర్వాత పలువురు యంగ్ హీరోస్ దగ్గరికి ఈ కథ వెళ్ళింది.  కానీ స్టోరీ నచ్చిన దర్శకుడు కొత్త కావడంతో రిజెక్ట్ చేశారట. చివరికి ఈ కథను వైష్ణవ్ తేజ్ చేసి హిట్టు కొట్టాడు. ఒకవేళ నాని చేసి ఉంటే మాత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అతని ఖాతాలో చేరిపోయేది అని ప్రస్తుతం సినీ ప్రేక్షకులు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: