ఆస్కార్ వేడుకలకి చరణ్ ఒక్కడే.. తారక్ వెళ్లట్లేదు?

Purushottham Vinay
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ చరణ్ జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో చక్కటి లాటరీ కొట్టాడు. రాజమౌళి చెక్కిన ఆ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. హాలీవుడ్ నటులు ఇంకా దర్శకులు కూడా ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ పాత్ర పై ప్రశంసలు కురిపిస్తున్నారు.అంతటి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు  రామ్ చరణ్. అయితే దీని అంతటికి కారణం రాజమౌళి. ఎన్నో ట్రోల్స్ ఎదురుకున్న చరణ్ ని గ్లోబల్ స్టార్ గా మార్చాడు. రాజమౌళి కారణంగా ఈ మూవీకి ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చింది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇక ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ఆర్ఆర్ఆర్ సినిమా పలు అద్భుతమైన అవార్డులని సొంతం చేసుకోవడంతో పాటు ఇప్పుడు నాటునాటు పాట కూడా బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో ఆస్కార్ రేసులో గట్టిగానే పోటీ పడుతుంది. ఇదిలా ఉంటే హాలీవుడ్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ కూడా రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ పై ప్రశంసలు కురిపించడం జరిగింది. దీనిపై మెగాస్టార్ చిరంజీవి కూడా రియాక్ట్ అయ్యి పుత్రోత్సాహాన్ని ఆశ్వదించారు.


ఇదిలా ఉంటే ఇప్పుడు రామ్ చరణ్ అయ్యప్ప స్వామి మాలలో ఉన్నారు.ఇక ఈ మాలలోనే ఆయన అమెరికాకి వెళ్ళడం విశేషం. ఈ ఆస్కార్ అవార్డుల వేడుక జరగడానికంటే ముందే ఆస్కార్ అవార్డులకి సంబంధించి సెలబ్రిటీల మీట్ అప్ లని నిర్వహిస్తూ ఉంటారు. ఇంకా ఈ నేపధ్యంలో తాజాగా రామ్ చరణ్ యూఎస్ఏ వెళ్ళినట్లు సమాచారం తెలుస్తుంది.రామ్ చరణ్ తో పాటు రాజమౌళి కూడా ఈ అవార్డుల వేడుకకి వెళ్ళినట్లు సమాచారం తెలుస్తుంది.అయితే తారక్ కూడా వెళ్ళాల్సి ఉంది. కానీ ఇంట్లో తన అన్న తారకరత్న మృతి చెందడంతో ఆ విషాదంలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు.ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ వెళ్ళలేకపోయాడు. దీంతో రామ్ చరణ్ ఒక్కడే అవార్డుల వేడుకకి యూఎస్ వెళ్ళారని సమాచారం తెలుస్తుంది. ఇక ఆ వేడుకలు ముగించుకొని ఇండియా వచ్చిన తర్వాత మళ్ళీ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా షూటింగ్ లో రామ్ చరణ్ పాల్గొంటాడని సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: