రామ్ చరణ్ లో మార్పు.. ఇదే కావాలంటున్న ఫ్యాన్స్?

praveen
సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ ఎప్పుడు గంభీరంగా కనిపించే హీరోలలో మెగాస్టార్ వారసుడు రామ్ చరణ్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఆయన ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు కాదు. కేవలం స్నేహితులతో తప్ప మిగతా అందరితో కూడా కాస్త సీరియస్ గానే ఉండేవారు. ఎక్కడైనా సినిమా ఫంక్షన్లకు వెళ్లినప్పుడు కూడా ఇక రామ్ చరణ్ నవ్వడం చాలా అరుదుగా చూసేవారు అభిమానులు.

 ఇక ఇలా ఎప్పుడు సీరియస్ గా కనిపించే రాంచరణ్ లో ఇటీవల కాలంలో మాత్రం మార్పు వస్తుంది అన్నది తెలుస్తుంది. ఒకప్పుడు సోషల్ మీడియాకు ఎంతో దూరం ఉన్న రామ్ చరణ్ ఇక ఇప్పుడు ఎంతగానో యాక్టివ్ గా ఉంటున్నారు ఇక అభిమానులకు తన సినిమా అప్డేట్లను ఇస్తూ ఉన్నారు. అంతేకాదు ఎన్నో ఆసక్తికర వీడియోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో అయితే నిత్యం జనాల్లోనే కనిపిస్తున్నారు. ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు అని చెప్పాలి. ఇటీవల హైదరాబాద్లో నెక్లెస్ రోడ్ లో నిర్వహించిన ఈ ఫార్ములా రేసింగ్ లోను స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు రామ్ చరణ్.

 ఇటీవల క్యాన్సర్ తో పోరాడుతున్న తన అభిమానిని మేక్ ఏ విష్ ఫౌండేషన్ ద్వారా ఒకసారి కలిసి కోరిక తీర్చారు అన్న విషయం తెలిసిందే. ఇక పబ్లిక్ గా కూడా ఎంతో యాక్టివ్గా మూవ్ అవుతున్నాడు. ఈ రేసింగ్ లో పాల్గొన్న సమయంలో ఆనంద్ మహేంద్ర తో కలిసి నాటు నాటు పాటకి స్టెప్పులేసాడు. ఇక ఇటీవల  ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యతో  కలిసి అక్షయ్ కుమార్ హిట్ మూవీ మే కిలాడి తూ అనారి సినిమాలోని ఒక సాంగ్ కి డాన్స్ చేశారు. ఈ వీడియో వైరల్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో చరణ్ కూల్ గా కనిపిస్తూ ఎక్కువ యాక్టివ్ కావడంతో ఈ మార్పు చూసి అభిమానులు కూడా ఆనంద పడుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: