SSMB28: ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న త్రివిక్రమ్?

Purushottham Vinay
ఇక టాలీవుడ్ టాప్ హీరోగా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది.అదేంటంటే ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 28వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.సర్కారు వారి పాట సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్ బాబు ఎవరితో సినిమా చేస్తాడు అని ఆయన ఫ్యాన్స్ అందరూ ఎదురుచూస్తున్న సమయంలో త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నట్లు సర్కారు వారి పాట టైం లోనే అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన ఒక షెడ్యూల్ షూటింగ్  పూర్తయింది, తర్వాత మహేష్ బాబు తల్లి తండ్రి గార్లు మరణించడంతో కొంత గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు హైదరాబాదులో ఈ సినిమా షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని సీన్స్ లో నటించారు. షూటింగ్ కి గ్యాప్ రావడంతో ప్రస్తుతానికి ఆయన విదేశాలకు వెళ్ళాడు.


ఆయన వెళ్లినా కూడా సినిమా మిగతా పార్ట్ షూటింగ్ మాత్రం జరుగుతోంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ రెండు గుర్రాల స్వారీ చేస్తున్నారని ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది. ఇక అదేమిటంటే అటు డైరెక్టర్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ సినిమాకి బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోపక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాయి ధరమ్ తేజ్ కీలక పాత్రలో నటిస్తున్న వినోదయ సిత్తం అనే తమిళ రీమేక్ సినిమాకు కూడా స్క్రీన్ ప్లే డైలాగ్ రైటర్ గా కూడా త్రివిక్రమ్ వ్యవహరిస్తున్నారని సమాచారం తెలుస్తోంది. SSMB28 సినిమా మహేష్ కి ఏమో కానీ ఆయన ఫ్యాన్స్ కి స్పెషల్. ఆ సినిమాకి సంబంధించి అన్ని పర్ఫెక్ట్ గా వుండాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే త్రివిక్రమ్ ఒకేసారి ఇలా రెండు మేనేజ్ చెయ్యడం వల్ల మహేష్ సినిమా సరిగ్గా రాదేమో అని టెన్షన్ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: