రైటర్ పద్మభూషణ్.. మహిళలకు టికెట్స్ ఉచితం..!

Divya
కలర్ ఫోటో సినిమా ద్వారా మంచి ఫామ్ లోకి వచ్చి.. ఇప్పుడు రైటర్ పద్మభూషణ్ సినిమాతో ముందుకు వచ్చారు హీరో సుహాస్. ఇటీవల విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకుపోతోంది ఈ సినిమా ఫన్ ఎమోషనల్ తో కూడిన ఈ సినిమాను డైరెక్టర్ షణ్ముఖ ప్రశాంత్ చాలా చక్కగా తెరకెక్కించారు అందుకే చిన్న సినిమా అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్గా దూసుకుపోతోంది. ఈ సినిమా కోసం కేవలం మూడు కోట్ల 80 లక్షల రూపాయల బడ్జెట్ కేటాయించగా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కును దాటి లాభాల్లోకి అడుగు పెట్టింది ఈ సినిమా.
ఏడాది ప్రారంభంలో వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి మంచి విజయాలను అందుకొని..  భారీ జోష్ మీద ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీ విజయ పరంపర కొనసాగిస్తూ బాక్సాఫీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ సినిమాను చూసి ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. రోజురోజుకు ఈ సినిమాకి వస్తున్న ఆదరణ చూసి చిత్ర యూనిట్ ప్రేక్షకుల కోసం ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. అది చూసి ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఏమిటంటే ఈ చిత్రం బుధవారం రోజు అనగా ఈరోజు ఆడవాళ్లకు 30 సెలెక్టివ్ థియేటర్స్ లో ఉచితంగా ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నట్లు ప్రకటించారు.  ఈ విషయాన్ని స్వయంగా మూవీ యూనిట్ అధికారికంగా స్పష్టం చేసింది ఇకపోతే ఇప్పటివరకు ఏ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ కూడా ఇలాంటి పని చేయలేదు. మహా అయితే కేవలం టికెట్ల రేట్లు మాత్రమే తగ్గించారు కానీ ఏకంగా మహిళల కోసం ఉచితంగా టికెట్లు అందిస్తున్నారంటే మూవీ టీం కి ఆడవాళ్ళ పైన ఏవిధంగా గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు.  ఒక సినిమా బలంగా లాంగ్ రన్ లో  కొనసాగాలి అంటే మహిళలు థియేటర్స్ కి కదిలితేనే అనే ట్రేడ్ విశ్లేషకులు అంచనాలు నిజం చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: