వావ్: బాలయ్య షోలో మెగా మేనల్లుడు..!!

Divya
ఆహా ఓటీటి లో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ షో టిఆర్పి రేటింగ్ లో మొదటి స్థానంలో ఉందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ ఎపిసోడ్ వల్ల సర్వార్లు క్రాస్ అయినట్లుగా కూడా వార్తలు వినిపించాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ షోలోకి గెస్ట్ గా హాజరు కావడంతో ఎలా షాక్ ఇవ్వబోతున్నాడు అనే విషయం హాట్ టాపిక్ గా మారుతోంది .రీసెంట్గా వచ్చిన టీజర్ తోనే బాగా ఆకట్టుకుంది.

ఈ రేంజ్ లో పవన్ కళ్యాణ్ ని బాలయ్య అడిగిన ప్రశ్నలు అందుకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. ఇప్పుడు ఈ షో కి సంబంధించిన మరొక పిక్ ఇప్పుడు బయటకు రావడం జరిగింది. ఆ పిక్ లో మెగా మేనల్లుడు సాయి ధరంతే సాంప్రదాయమైన దుస్తులలో కనిపించి దర్శనమిచ్చారు. ఇక మామయ్య పవన్ కళ్యాణ్ అంటే సాయి ధరంతేజ్ కి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటికే ఎన్నో సందర్భాలలో కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు.

ఇప్పుడు ఈ షోలో సాయి ధరమ్ తేజ్ ఏం చెప్పబోతున్నాడు అనే విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. మొత్తంగా అయితే పవన్ కళ్యాణ్ ,సాయి ధరమ్ తేజ్, బాలయ్య మరొకవైపు ఇలా ప్రేక్షకులను వినోదాన్ని పంచడంతో అభిమానులు సైతం మాకు ఇంకేం కావాలి అంటూ తెలియజేస్తున్నారు ఇలా టీజర్ తోనే ఫోటోలతోనే భారీ అంచనాలను పెంచేస్తున్న ఈ ఎపిసోడ్ జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా ట్రిమ్మింగ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మెగా నందమూరి అభిమానులే కాకుండా సామాన్య ప్రేక్షకుల సైతం ఈ ఎపిసోడ్ కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: