బాలయ్య షో కి చచ్చినా రాను అంటున్న రోజా.. అదే కారణమా..!?

Anilkumar
నందమూరి  బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా నేపథ్యంలోనే ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. తాజాగా నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య. ఈ క్రమంలోనే అటు సినిమాలు మరియు ఇటు అన్ స్టాప్ ఫుల్ షోలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ షో కి సంబంధించిన మొదటి సీజన్ ని విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు రెండవ సీజన్ కూడా అదే రేంజ్ లో దూసుకుపోతుంది. 

అయితే ఇప్పటికే ఈ షో కి నారా చంద్రబాబు నాయుడు ,ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖులు ఈ షోకి రావడంతో ఈ షో రేంజ్ మరింత పెరిగిపోయింది.అయితే తాజాగా ఈ షో పై సంచలన వ్యాఖ్యలను చేసింది రోజా. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తను ఇప్పుడు ఆ షో కి  రాను అని ఖరాఖండిగా చెప్పింది. అయితే రోజా బాలకృష్ణ సరసన ఇప్పటికే 7 8 సినిమాల్లో నటించానని.. బాలకృష్ణతో తనకి మంచి అనుబంధం ఉంది అంటూ తెలియజేసింది రోజా. ఇప్పటికే ఆ షో కి నన్ను గెస్ట్ గా రమ్మని రెండు మూడు సార్లు ఆ హ టీం నన్ను సంప్రదించడం జరిగింది.. ఇక ఆ సమయంలో నేను షో కి రావాలని భావించాను కానీ..

అనుకోకుండా ఆ రోజుల్లోనే నాకు అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో ఆ సమయంలో నేను బాలయ్య షోకి రాలేకపోయాను అంటూ చెప్పుకొచ్చింది.. కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన ఎపిసోడ్ నేను ఆ షో కి ఈ జన్మలో రావద్దు అని గట్టి నిర్ణయం తీసుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది రోజా. ఇకపోతే చంద్రబాబు మరియు బాలయ్య కలిసి చేసిన ఎపిసోడ్ చూసి తనకి చాలా భయం వేసింది అని..ఆ షో  లో వారిద్దరూ కలిసి చేసిన రాజకీయం తీరు పట్ల తనకి చాలా భయం కలిగింది అని.. అప్పటినుండి ఆ షో కి నేను అసలు హాజరు కావద్దు అన్న నిర్ణయాన్ని తీసుకున్నాను అంటూ చెప్పకు వచ్చింది రోజా. దీంతో రోజా చేసిన వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: