ఈ ఫోటోలో ఉన్న బావమరదళ్లు.. టాలీవుడ్ లో హీరో, హీరోయిన్లు తెలుసా?

praveen
సాధారణంగా ఫోటోలు అనేవి ప్రతి మనిషి జీవితంలో తీపి జ్ఞాపకాలుకు గుర్తులుగా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఒక్కసారి ఒక క్షణాన్ని ఫోటోలో బంధించామంటే చాలు ఇక ఎన్ని ఏళ్లయినా కూడా ఆ ఫోటో చూస్తూ ఆ సమయంలో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ప్రతి ఆనందకరమైన క్షణాన్ని  కూడా ఫోటోలో బంధించాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే త్రో బ్యాక్ ఫోటోలు ప్రతి ఒక్కరికి మెమోరీస్ ని గుర్తు చేస్తూ ఉంటాయని చెప్పాలి.

 అయితే ఇక ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపద్యంలో ఎంతో మంది సినీ సెలబ్రిటీలకు సంబంధించిన త్రో బ్యాక్ ఫొటోస్ ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. హీరో హీరోయిన్లకు సంబంధించిన ఫోటోలను  సోషల్ మీడియాలో పోస్ట్ ఈ హీరో లేదా హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా అంటూ ప్రశ్నలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తారస పడుతూ ఉంటాయని చెప్పాలి.  ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

 అయితే ఇక్కడ రియల్ లైఫ్ లో బావ మరదలుగా కొనసాగుతున్న హీరో హీరోయిన్లకు సంబంధించిన ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ ఫోటోలో ఉన్న బావ మరదళ్లుగా ఉన్న ఆ హీరో హీరోయిన్లు ఎవరు అని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపుతున్నారు అని చెప్పాలి. అయితే వాళ్ళు ఎవరో కాదు ప్రస్తుతం మెగా హీరోగా కొనసాగుతున్న పంజా వైష్ణవ తేజ్ మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక. వీరి చిన్నప్పటి ఫోటో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించిన నిహారిక ఇక పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది.

 ఇకపోతే అటు పంజా వైష్ణవ్ తేజ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా తన ప్రస్తానాన్ని మొదలుపెట్టి ఉప్పెన అనే సినిమాతో  మెగా హీరో సుప్రీం స్టార్ సాయి ధరమ్ తేజ్ సోదరుడిగా ఇక ఇండస్ట్రీకి పరిచయమైన వైష్ణవి తేజ్ ఇక మొదటి సినిమాతోనే బ్లాక్బస్టర్ హిట్టు కొట్టాడు. ఆ తర్వాత కొండపోలం సినిమాతో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులతో బిజీ బిజీగా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదల పుట్టినరోజు జరుపుకున్న నేపద్యంలో ఇక ఈ త్రో బ్యాక్ ఫోటో ని షేర్ చేసిన పంజా వైష్ణవ్ తేజ్ నిహారిక కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: