హీరో కార్తీకి మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ?

praveen
ఇటీవల కాలంలో ఎంతోమంది హీరోలు సినిమాల్లో స్టార్ హీరోలుగా కొనసాగుతూ ఉండడమే కాదు అటు నిజజీవితంలో కూడా రియల్ హీరోలుగా మారిపోతూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇలాంటి వారిలో అటు తమిళంలోనే కాదు తెలుగులో కూడా స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకొని ఇక తన సినిమాలతో వరుస విజయాలు అందుకుంటున్న కార్తీ కూడా ఒకరు అన్న చెప్పాలి. గత కొంతకాలం నుంచి హీరోగా వరుస విజయాలను సాధిస్తూ దూసుకుపోతున్నాడు కార్తీ.

 పరుత్తి వీరన్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన కార్తి తొలి చిత్రంతోనే ఘనవిజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత కూడా కేవలం కమర్షియల్ హంగులు ఉన్న సినిమాలు మాత్రమే చేయకుండా కథ బలంగా ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ సూపర్ హిట్లు కొడుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక గత ఏడాది విరుమన్, పోన్నియన్ సెల్వన్, సర్దార్ లాంటి సినిమాల్లో నటించి హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇకపోతే ఇలా సినిమాల్లో హీరోగా కొనసాగుతూ ఉండడమే కాదు ఉలవన్ ఫౌండేషన్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు.

 ఇక రాష్ట్రంలోని వ్యవసాయదారులను ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు చేపడుతూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇలాంటి గొప్ప మనసున్న హీరోకి ఇటీవల మ్యాన్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు దక్కడం విశేషం. ఇటీవల ఒక బుల్లితెర ఛానల్ హీరో కార్తీకి ఇక ఈ అరుదైన అవార్డును ప్రకటించారు. అయితే నటుడు కార్తీ ప్రస్తుతం విహారయాత్రలో ఉన్న నేపథ్యంలో  ఈ అవార్డును సర్దార్ చిత్ర నిర్మాత కార్తి స్నేహితుడు అయిన లక్ష్మణన్ అందుకున్నాడు అని చెప్పాలి.  ఏదేమైనా ఇక తమ అభిమాన హీరోకి ఇలాంటి అరుదైన అవార్డు రావడంతో ఫాన్స్ కూడా సంతోషంలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: