'వీరసింహరెడ్డి' మాస్ డైలాగ్ తో దుమ్ములేపిన బాలయ్య మనవడు.. వీడియో వైరల్..!!

Anilkumar
నటసింహా నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ సినిమాని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా శృతిహాసన్ కథానాయికగా నటిస్తూ ఉండగా.. వరలక్ష్మి శరత్ కుమార్, కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సినిమా పైన అంచనాలను రెట్టింపు చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది ఈ సినిమా. ఇదిలా ఉంటే జనవరి 6 వ తేదీన ఒంగోలులో వీరసింహారెడ్డి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర యూనిట్ నిర్వహించిన విషయం తెలిసిందే. 

అయితే ఈ వేడుకలో బాలకృష్ణ మనవడు ఆర్య వీర్ కు సంబంధించిన ఓ వీడియోను ప్లే చేయడం జరిగింది. ఆ వీడియోలో బాలయ్య మనవడు ఓ పవర్ ఫుల్ డైలాగ్ తో అదరగొట్టేసాడు. వీర సింహారెడ్డి సినిమాలోని 'భయం నా బయోడేటా లో లేదురా' అనే డైలాగ్ ను ఆర్య వీర్ రీ క్రియేట్ చేశాడు. యాక్షన్ అంటూ బాలయ్య చెప్పగానే.. డైలాగ్ ని నాన్ స్టాప్ గా చెప్పి అదరగొట్టేసాడు. ఇక దీనికి సంబంధించిన వీడియోను వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రసారం చేయగా.. ఆ వీడియో చూసిన బాలయ్య తో పాటు ఆయన ఫాన్స్ కూడా తెగ సంబరపడిపోయారు. ఇక బాలయ్య మనవడు చెప్పిన ఈ డైలాగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. 

బాలయ్య డైలాగ్ తన మనవడి నోటి వెంట రాగానే ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు. దీంతో ఈ వీడియోని సోషల్ మీడియా మాధ్యమాల్లో ట్రెండ్ చేస్తున్నారు. ఇక మరోవైపు ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరసింహారెడ్డి ట్రైలర్ భారీ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ట్రైలర్ విడుదలైన 12 గంటల్లోనే 5 మిలియన్ల వ్యూస్ ని రాబట్టి సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. అభిమానులు బాలయ్య నుంచి ఎలాంటి మాస్ సినిమాని కోరుకుంటున్నారో.. అలాంటి మాస్ ఎలిమెంట్స్ అన్నీ వీర సింహారెడ్డి చిత్రంలో తీర్చిదిద్దాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఇక సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి...!!



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: