హైపర్ ఆది-సద్దాం మధ్య మనస్పర్థలు..అదే కారణమా..!?

Anilkumar
బుల్లితెరపై ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమీడియన్స్ స్టార్ కమెడియన్లుగా మారారు.అలా స్టార్ కమెడియన్లుగా ఎదిగిన వారిలో హైపర్ ఆది కూడా ఒకరు. ఈ షో తో హైపర్ ఆది ఎంతటి గుర్తింపును పొందడం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఆయన పంచ్ డైలాగులతో ఎంతోమందిని ఆకట్టుకున్నాడు హైపర్ ఆది. ప్రస్తుతం ఈయన షో లతోపాటు సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నాడు. జబర్దస్త్ షో తో ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ మరియు డి షోలతో బిజీగా ఉన్నాడు.ఇదిలా ఉంటే ఇక హైపర్ ఆది లాగా పటాస్ షో తో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు సద్దాం.

ప్రస్తుతం ఈయన జబర్దస్త్ షోలో స్కిట్లో చేస్తున్నాడు. అయితే మొదట సద్దాం కూడా జబర్దస్త్ లో స్కిట్లలో భాగమయ్యేవాడు కానీ అనుకోకుండా ఈ షో నుండి సద్దాం తప్పుకున్నాడు. దీంతో చాలామంది సద్దాం కి మరియు హైపర్ ఆదికి ఏమో మనస్పర్ధలు వచ్చాయని అందుకే సద్దాం వెళ్ళిపోయాడు అన్న వార్తలు సైతం రావడం జరిగింది. తాజాగా సద్దాం తిరిగి జబర్దస్త్ లో స్కిట్స్ చేస్తున్నాడు. సద్దాం తో పాటు యాదమ రాజు కూడా ఆయన స్కిట్లలో  చేస్తున్నాడు. అయితే తాజాగా జరిగిన ఒక ఈవెంట్ లో హైపర్ ఆది వీరిద్దరి మనస్పర్ధలపై స్పందించాడు.

2022లో తమ మధ్య మనస్పర్ధలు వచ్చాయని చెప్పుకొచ్చాడు ఆది.
డిసెంబర్ 31వ తేదీ రాత్రి ప్రసారం కానున్న 2023 న్యూ ఇయర్ స్పెషల్ ఈవెంట్ కి సంబంధించిన ప్రోమోలో ఈ విషయాన్ని బయట పెట్టాడు ఆది. 2022లో నాకు సద్దాం కి మనస్పర్ధలు వచ్చాయని అవి 2023లో పోవాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు అది. దీంతో వీరిద్దరి మధ్య ఎందుకు మనస్పర్ధలు వచ్చాయి అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: