యాంకర్ సుమ సంచలన నిర్ణయం.. షాక్ లో ఫ్యాన్స్..?

Anilkumar
బుల్లితెరపై టాప్ యాంకర్ గా చలామణి అవుతున్న సుమ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.ఈమె  ఒక ప్రోగ్రాం లో వస్తుంది అంటే చాలు ఆమె అభిమానులకు పండగే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తెరపై ఈమె కనిపిస్తే ఆమె అభిమానుల పెదవుల పై చిరునవ్వు ఖాయం.షో లే కాకుండా పలు ఆడియో ఫంక్షన్లలో కూడా సుమా అందరినీ అలరిస్తూనే  ఉంటుంది. ఇక అందరినీ అంతలా ఆకట్టుకునే సుమా ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈటీవీలో డిసెంబర్ 31న వేర్ ఇస్ ద పార్టీ అనే కార్యక్రమం రానుంది.

 దీనికి సంబంధించిన ప్రోమో ని తాజాగా విడుదల చేయడం జరిగింది. ఇక ఇందులో భాగంగా సుమతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. షో ముగిసే సమయంలో ఈ షో కి వచ్చిన సెలబ్రిటీలతో పాటు మిగిలిన వారందరూ కూడా సుమకి సన్మానం చేశారు. శాలువా కప్పి సత్కరించారు. ఇందులో భాగంగా సుమా మాట్లాడుతూ తను తీసుకున్న ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా సుమా మాట్లాడుతూ మలయాళీగా పుట్టిన నేను ఇక్కడ సెటిల్ అయ్యాను అంటే అది కేవలం తెలుగు వాళ్ళు నాకు ఇచ్చిన అభిమానం ప్రేమ వాళ్ళు లేకపోతే నేనులేను నా మాటలు రాసి పెట్టుకోండి

 కానీ వీటన్నిటికీ కొంత విరామం అయితే తీసుకోవాలి అని అనుకుంటున్నాను అంటూ తన షాకింగ్ నిర్ణయాన్ని బయటపెట్టింది సుమ. గతంలో కూడా సుమ కొన్ని కారణాలవల్ల ఈటీవీలో ప్రసారమయ్యే స్టార్ మహిళ ప్రోగ్రాం లో కూడా మానేసింది.దీంతో సుమ తీసుకున్న షాకింగ్ నిర్ణయాన్ని తాజాగా ఈ ప్రోమోలో బయట పెట్టడంతో ఆమె అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఎందుకు సుమా సడన్గా ఇలాంటి నిర్ణయం తీసుకుంది అన్న కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. దీంతో సుమకి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. సుమ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది అన్నది తెలియాలంటే డిసెంబర్ 31న ప్రసారమయ్యే వేర్ ఇస్ ద పార్టీ షో  వచ్చేదాకా వేచి  చూడాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: