వావ్.. ఒకే ఫ్రేమ్లో బాలయ్య, పవన్.. పిక్ వైరల్?

Purushottham Vinay
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి నట సింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్' షోకి పవన్ కళ్యాణ్ హాజరు అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్ లాంటి టాప్ స్టార్స్ ఈ షోకి వచ్చి సందడి చేశారు. ఇక మరో టాప్ హీరో అయిన పవన్ కళ్యాణ్ కోసం అభిమానులు ఎదురు చూడగా అది కూడా జరగబోతుంది.ఈ ఇద్దరినీ కూడా ఒకే ఫ్రేమ్ లో చూడటం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక వీరి ఇద్దరి మధ్య జరగబోయే సరదా సంభాషణ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి అందరిలో కూడా నెలకొంది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తూ తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్ గా ఉంది.


ఇక వీరి సినిమాల విషయానికి వస్తే.. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'వీర సింహా రెడ్డి'. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సెట్స్ లో పవన్ కళ్యాణ్ బాగా సందడి చేశాడు.అలాగే movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ కూడా 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో 'వీర సింహా రెడ్డి' సినిమాలోని చివరి సాంగ్ షూటింగ్ జరుగుతుండగా పవన్ ఆ మూవీ సెట్స్ ని సందర్శించి మూవీ టీమ్ ని ముచ్చటించాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో బాలయ్య ఇంకా అలాగే పవన్ తో పాటు మైత్రి నిర్మాతలు కూడా ఉన్నారు. బాలయ్య, పవన్ కలిసిన ఫోటోకే ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తే.. ఇక 'అన్ స్టాపబుల్' షోలో వీరిద్దరూ కలిసి సందడి చేస్తే అసలు రెస్పాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో అంటూ ఫ్యాన్స్  ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: