"డెవిల్" మూవీ కోసం తమిళనాడుకు వెళ్ళిన కళ్యాణ్ రామ్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటుడి గా , నిర్మాత గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచకున్న నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా బింబిసరా అనే మూవీnతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కి మల్లాడి వశిష్ట దర్శకత్వం వహించగా , క్యాథరిన్ మరియు సంయుక్త మీనన్ లు ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ లుగా నటించారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ మూవీ ల లిస్ట్ లో చేరిపోయింది. ఇలా బింబిసరా మూవీ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తన తదుపరి మూవీ లపై కాన్సన్ట్రేషన్ పెట్టాడు.

అందులో భాగంగా కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ఏమిగోస్ మరియు డెవిల్ మూవీ లలో నటిస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తన పూర్తి కాన్సన్ట్రేషన్ ను డెవిల్ మూవీ పై పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా డెవిల్ మూవీ కి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించడం కోసం తమిళనాడు లోని కరైకుడికి వెళ్లినట్లు తెలుస్తోంది. అలాగే 20 రోజుల పాటు ఈ మూవీ యూనిట్ ఇక్కడ ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. డెవిల్ మూవీ పిరియాడిక్ కథతో రూపొందిస్తున్నారు. ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నాడు. ఈ మూవీ కి నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: