బాలకృష్ణ 108 మూవీలో ఆ యంగ్ హీరోయిన్..?

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వీర సింహా రెడ్డి అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి క్రాక్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న గోపీచంద్ మాలినేని దర్శకత్వం వహిస్తూ ఉండగా , శృతి హాసన్ ఈ మూవీ లో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా , దునియా విజయ్ ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తూ ఉండగా , movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు తాజాగా ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నిలకోని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ ఈ మూవీ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే మూ వీలో హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందిపోతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో బాలకృష్ణ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ లో బాలకృష్ణ కు కూతురుగా శ్రీ లీల కనిపించబోతున్నట్లు ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో బాలకృష్ణ సరసన రెండవ హీరోయిన్ గా ప్రియాంక జవల్కర్  ను ఈ మూవీ యూనిట్ తీసుకోబోతున్నట్లు ,  అందులో భాగంగా ఇప్పటికే ఈ ముద్దుగుమ్మతో చర్చలు జరిపినట్లు , ఈ ముద్దుగుమ్మ కూడా ఈ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: