నాగశౌర్య ఎంత కట్నం తీసుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు..మరీ అన్ని కోట్లా..?

Anilkumar
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఇన్నాళ్ల పాటు కొనసాగుతూ వచ్చిన నాగశౌర్య ఎట్టకేలకు తాను ప్రేమించిన అనూష శెట్టి మెడలో తాళి కట్టి వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు.ఇక ఈ నేపథ్యంలో నాగశౌర్య అభిమానులైతే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.అయితే  నిజానికి కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత టాలీవుడ్ లో జరుగుతున్న మొట్టమొదటి శుభకార్యం కావడంతో పెద్ద ఎత్తున టాలీవుడ్ ప్రముఖుల అందరినీ ఆహ్వానించి గ్రాండ్గా పెళ్లి చేసుకుంటాడని అందరూ భావించారు.ఇకపోతే తెలుగు అబ్బాయి కన్నడ అమ్మాయి కాంబినేషన్ బాగుందని పలువురు

 కామెంట్స్ చేస్తుండగా వీరు కట్నం ప్రస్తావన కూడా తెర మీదకు వస్తోంది.అయితే  నాగశౌర్య ఈ పెళ్లి చేసుకునేందుకు ఎంత కట్నం తీసుకున్నాడు అనే వివరాలు గురించి గూగుల్ లో చాలామంది వెతుకుతున్నారు. ఇక ఈ పెళ్లి చేసుకుంటున్న సమయంలో నాగశౌర్య కట్నం కూడా బాగా అందినట్లు తెలుస్తోంది. కాగా అనూష శెట్టి స్వగ్రామం మంగళూరు దగ్గరలోని కుందాపుర.ఇక ఆమె తండ్రి అనూష చిన్నప్పుడే బెంగళూరు వచ్చి అక్కడే వ్యాపారాలు చేస్తూ సెటిలయ్యారు.అయితే  కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించిన ఆయన ప్రస్తుతానికి కూడా పలు వ్యాపారాలు చేస్తున్నారట.

కాగా  అనూష శెట్టి వ్యాపారం కూడా కోట్లలో టర్నోవర్ ఉంటుందని తెలుస్తోంది. నాగశౌర్యకు నగదు రూపంగా ఎలాంటి కట్నం ఇవ్వలేదు కానీ అనూష శెట్టి పేరు మీద ఉన్న కొన్ని ప్రాపర్టీ లను నాగశౌర్య పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.ఇకపోతే ఆ ప్రాపర్టీల విలువ 50 నుంచి 80 కోట్ల దాకా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇక ఇదంతా ప్రచారమే కాగా అసలు నిజం ఏమిటన్నది నాగశౌర్య ఆయన భార్యకు మాత్రమే తెలియాలి. ప్రస్తుతానికి నాగశౌర్య చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఇక వాటితో ఎలా అయినా హిట్ అందుకోవాలని ఆయన గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు శౌర్య.ఇక సదరు అనూష శెట్టి బెంగళూరు బేస్ గా ఒక ఇంటీరియర్ డిజైనర్ కంపెనీ నడుపుతోంది.అయితే  కొందరు కామన్ ఫ్రెండ్స్ ద్వారా వీరికి పరిచయం అవగా అది ముందు స్నేహానికి ఆ తర్వాత ప్రేమకు దారి తీసినట్లు తెలుస్తోంది.ఇక  తర్వాత వివాహ బంధంతో ఒకటి అవ్వాలని నిర్ణయించుకుని ఇద్దరి ఇళ్లలో ఒప్పించి ఎట్టకేలకు ఒకటయ్యారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: