బాలయ్య 'అన్ స్టాపబుల్' ట్రిపుల్ హంగామా..!?

Anilkumar
బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కొత్త ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో అందరికి తెల్సిందే. ఇక ఈ కార్యక్రమం నుండి గత వారం కొత్త ఎపిసోడ్ రాకపోవడంతో ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేశారు.అయితే బాలయ్య తో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ ఈ షో లో పాల్గొనబోతుంది.  మాజీ ముఖ్య మంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరియు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి లు తాజా ఎపిసోడ్ లో బాలయ్య తో సందడి చేయబోతున్నారు.ఇక  ఇప్పటికే షూటింగ్ పూర్తి అయ్యిందని సమాచారం అందుతోంది.

ఇకపోతే రేపు ఈ ట్రిపుల్ హంగామా ఎపిసోడ్ ఉంటుందని ఆహా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.  ఒక హీరోయిన్ తో పాటు మాజీ ముఖ్యమంత్రి మరియు మాజీ అసెంబ్లీ స్పీకర్ ను తీసుకు రావడం ఒకింత విడ్డూరంగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ కాంబినేషన్ చాలా కొత్తగా ఉందని సినీ జనాలు కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే గత సీజన్ మొత్తం కూడా సినీ ప్రముఖులు మాత్రమే హాజరు అయ్యారు.  ఈ సీజన్ లో మాత్రం మొదటి ఎపిసోడ్ లోనే చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ హాజరు అయిన విషయం తెల్సిందే. 8కె ఆ తర్వాత రెండు ఎపిసోడ్స్ లో యంగ్ హీరోలు హాజరు అయ్యారు.

నాల్గవ ఎపిసోడ్ లో ఇలా సినీ మరియు రాజకీయ కలయిక లో గెస్ట్ లను తీసుకు రావడం కొత్తగా ఉందంటున్నారు.ఇకపోతే వీరసింహారెడ్డి సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కారణంగా అన్ స్టాపబుల్ కి బాలయ్య ఎక్కువ డేట్లు ఇవ్వలేక పోతున్నాడు అనేది మీడియా సర్కిల్స్ మాట. ఇక ఈ వారం తర్వాత ఇక నుండి కంటిన్యూ గా ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అవుతాయని అంటున్నారు. కాగా ఈ సీజన్ లో మొత్తం 15 నుండి 17 ఎపిసోడ్స్ ఉంటాయట. ఇకపోతే బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2 లో ఈ ఎపిసోడ్ చాలా స్పెషల్ గా ఉంటుందని ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక నేడు ఎపిసోడ్ యొక్క ప్రోమో విడుదల అయ్యే అవకాశం ఉంది.అయితే  స్ట్రీమింగ్ గురించి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ ఎపిసోడ్ రేపు స్ట్రీమింగ్ అవ్వబోతుంది అనుకోవడానికి లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: