ఆ రెండు క్రేజీ బ్యానర్ లు కలిసి రామ్ చరణ్ తో మూవీ చేయబోతున్నాయా..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ ఇప్పటికే అనేక బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించి పాన్ ఇండియా రేంజ్ లో తన క్రేజ్ ను పెంచుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటు వంటి శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా రూపొందుతుంది. ఇప్పటివరకు ఈ మూవీ కి చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడం తో , ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్ లో 15 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యం లో ఈ మూవీ ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , సునీల్ , అంజలి ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు.

ఎస్ జే సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇలా ప్రస్తుతం భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటిస్తున్న రామ్ చరణ్ తన తదుపరి మూవీ లపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటి వరకు రామ్ చరణ్ తన తదుపరి మూవీ ని ఏ దర్శకుడి తో ... ఏ నిర్మాణ సంస్థలో చేయబోతున్నది అధికారికంగా ప్రకటించ లేదు. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం గమనిస్తే టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన నిర్మాణ సంస్థలు అయినటు వంటి యువి క్రియేషన్స్ మరియు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఒక భారీ బడ్జెట్ మూవీ ని తెరకెక్కించాలనే ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: