కాంతార కలెక్షన్స్ జోరు.. మరో రికార్డు బ్రేక్..

Satvika
కాంతార..ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా ఇదే మాట వినిపిస్తోంది.తక్కువ బడ్జెట్ తో,ఎటువంటి అంచనాలు లేకుండా థియెటర్లలోకి వచ్చింది.ఇప్పుడు ప్రభంజనాన్ని సృష్టిస్తుంది.. ప్రతి ఇండస్ట్రీలో కాసుల వర్షం కురుస్తుంది. కన్నడ ఇండస్ట్రీ హీరో రిషబ్ శెట్టి హీరోగా దర్శకుడిగా వ్యవహరించిన ఈ మూవీ విడుదలైన అన్ని భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాదు 16 కోట్లతో తెరకెక్కిన ఈ ఇప్పుడు 300కోట్లకు పైగా వసూల్ చేసింది. అలాగే బాహుబలి రికార్డులను కూడా కాంతార బ్రేక్ చేసింది. ఐఏండిబి భారతదేశంలోని ప్రస్తుత టాప్ 250 చిత్రాల జాబితాలో కాంతార మొదటి స్థానంలో నిలిచింది.

కన్నడలో రిలీజ్ తరువాత దాదాపు 15 రోజులకు ఇతర భాషల్లో విడుదలైన ఈ అన్ని చోట్ల తన సత్తాను చాటుకుంది.యావత్ దేశ వ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు కాంతార చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినీ పరిశ్రమతో పాటు రాజకీయ నాయకులు సైతం ఈ ను వీక్షిస్తూ చిత్ర యూనిట్‌ను ప్రశంసిస్తున్నారు.. ఈ సినిమా తర్వాత కర్ణాటక ప్రభుత్వం 60 ఏళ్లు పైబడిన ‘దైవ నర్తకుల’కి నెలవారీ పెన్షన్ రూ. 2,000 ప్రకటించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

ఒక్క కర్ణాటకలోనే కోటికి పైగా టిక్కెట్లు అమ్ముడైనట్టుగా చెబుతూ, మేకర్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. కన్నడిగుల సంప్రదాయమైన భూత కోల ఆచారం నేపథ్యంలో ఎంతో ఆసక్తికరంగా కాంతార ను తెరకెక్కించారు. ఇక ఈ మూవీ రోజు రోజుకు క్రేజ్ పెంచుకుంటూ కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటన హైలైట్ అనే చెప్పాలి.. వన్ మ్యాన్ షో గా ఈ సినిమా ను అద్భుతంగా తెరకెక్కించడమే కాకుండా అదే రేంజ్ లో నటించి ఆకట్టుకున్నాడు..ఈ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా వస్తే బాగుండునని సినీ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు..దీనిపై డైరెక్టర్ ఎలా స్పందిస్తా రో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: