ఆ సీక్వెల్ చేయాలనే కోరిక తో బాలకృష్ణ!!

P.Nishanth Kumar
నందమూరి బాలకృష్ణ ఇప్పటిదాకా ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. జానపద సాంఘిక సినిమాలను చేసి ప్రేక్షకులను అలరిస్తూ ఇప్పుడు ఈ స్థాయి హీరోగా ఎదిగిన ఈ హీరో ఇప్పుడు మాస్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహా రెడ్డి అనే సినిమాను చేసిన బాలకృష్ణ తొందరలోనే ఆ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అఖండ సినిమా సంచలన విజయమందుకోవడంతో ఇప్పుడు ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయని చెప్పాలి

దానికి తోడు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్లు ప్రేక్షకులను ఎంతగానో అలరించగా ఈ సినిమా తప్పకుండా భారీ విజయం అందుకుంటుంది అని నమ్మకాన్ని నందమూరి అభిమానులు కలిగిస్తున్నారు ఈ నేపథ్యంలోనే నందమూరి బాలకృష్ణ చేయబోయే తదుపరి సినిమాల గురించి వార్తలు వినిపిస్తున్నాయి అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాను జనవరి నుంచి మొదలుపెట్టబోతున్న నందమూరి బాలకృష్ణ ఆ తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఆయన కెరియర్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన ఆదిత్య 369 సినిమా యొక్క సీక్వెల్ చేయాలని నందమూరి బాలకృష్ణ ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. ఆయన 100వ సినిమాగా ఈ చిత్రం యొక్క సీక్వెల్ చేయాలని భావించారు కానీ అది కుదరలేదు. దాంతో ఇప్పుడు ఆయన ఈ సినిమా యొక్క సీక్వెల్ చేయడానికి సిద్ధమవుతున్నాడు ఆదిత్య 999 అనే సినిమాను ఆయన చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి. మరి ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనే విషయం త్వరలోనే తెలియనుంది. ఆదిత్య 369 సినిమా చేసిన సంగీతం శ్రీనివాసరావు వయసు అయిపోవడంతో ఆయన ఈ చిత్రానికి దర్శకుడుగా వ్యవహరించడు అనే విషయమై క్లారిటీ వస్తుంది. మరి ఈ తరం దర్శకులలో ఎవరు ఈ సినిమాను బాగా హ్యాండిల్ చేస్తారో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: