చిరంజీవి ఎంత మంది దర్శకులతో చేస్తున్నాడంటే?

P.Nishanth Kumar
మెగాస్టార్ చిరంజీవి యువ హీరోలతో పోటీగా సినిమాలు చేస్తూ ఉండడం ఆయన అభిమానులను ఎంతగా నో సంతోషపరుస్తుంది. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో ఆయన ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఆచార్య సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆయన దసరా కానుక గా డ్ ఫాదర్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఆ విధంగా ఈ ఏడాదిలో రెండు సినిమాలను విడుదల చేసి మెగా అభిమానులను అలరించి మిశ్రమ ఫలితాలను అందు కున్నాడు

ప్రస్తుతం మరికొన్ని సినిమాలను కూడా త్వరలోనే విడుదల చేసేందుకు ఆయన రంగం సిద్ధం చేస్తు న్నాడు. ఇప్పటికే బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న వాల్తేరు వీరయ్య సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు.  సంక్రాం తికి మాస్ మసాలా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం మెగాస్టార్ 154వ సినిమాగా అలరించబోతుంది. ఆ తరువాత మెహర్ రమేష్ దర్శత్వంలో భోళా శంకర్ సినిమా ను కూడా పూర్తి చేసిన మెగాస్టార్ చిరంజీవి ఆ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. 

ఏదేమైనా మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులను అలరించడం కోసం ఈ విధంగా వరుస సిని మాలను చేయడం మంచి విషయం అనే చెప్పాలి. ఇక మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. కొంతమంది యు వ దర్శకులు ఆయనతో సినిమా చేయాలని ప్రయత్నాలు చేసినా కూడా అవి వర్కౌట్ కాలేదని చెప్పాలి. వెంకీ కుడుముల కథను దాదాపుగా ఓకే చేసిన మెగాస్టార్ చిరంజీవి చివ రి క్షణం లో దాన్ని రిజెక్ట్ చేశాడు. దాంతో ఇప్పుడు ఆయనతో సినిమా చేసే దర్శకుడు ఎవరు అని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రా నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: