సాయిపల్లవి సినిమాలకు దూరం అవ్వడానికి కారణం అదేనా...?

murali krishna
నాచురల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకొని ఇండస్ట్రీలో పవర్ స్టార్ అంటూ బిరుదును అందిపుచ్చుకున్న సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
తన పరిధిలో వచ్చిన సినిమాలను మాత్రమే అందుకుంటూ.. మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది. మలయాళం ప్రేమమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ఇప్పుడు దక్షిణాది అన్ని భాషలలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది. హీరోల పాత్రలకు దీటుగా ఉండే పాత్రల ను ఎంచుకుంటూ యంగ్ హీరోల సినిమాకు ప్లస్ గా మారుతున్న సాయి పల్లవి ని టాలీవుడ్ స్టార్స్ కూడా తెగ పొగిడేస్తున్నారు. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ప్రస్తుతం అదే రేంజిలో ఉండడం విశేషం..
మరి ఇంత క్రేజ్ సంపాదించుకున్న సాయి పల్లవి చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడం ఆశ్చర్యకరం. సాయి పల్లవి నటించిన గార్గి , విరాటపర్వం చిత్రాలు రెండూ కూడా డిజాస్టర్ గా మిగిలాయట.ఈ క్రమంలోనే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలంటే గ్లామర్ షో తప్పనిసరి. అయితే ఈమెకు ఎక్కువగా గ్లామర్ షో చేయడానికి అవకాశాలు వస్తుండడం వల్ల సినిమాలకు దూరం అయింది అని వార్తలు వినిపించాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పెళ్లి చేసుకోబోతోంది కాబట్టే సినిమాలకు దూరం అవుతోంది అనే వార్తలు వినిపిస్తూ ఉండడం గమనార్హం. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి తన వ్యక్తిగత విషయాలను తెలిపిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. తన ప్రేమ విషయాన్ని బయట పెట్టింది. ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..తాను నాన్ వెజ్ తిననని కానీ ప్రేమించిన వ్యక్తి కోసం చికెన్ షాప్ లో నాన్ వెజ్ కొనుగోలు చేసి మరి తనకు వండి పెడతానని షాకింగ్ విషయాలు వెల్లడించారు. అయితే తెలుగు అబ్బాయినీ మాత్రమే పెళ్లి చేసుకుంటానని, లేకపోతే సింగల్ గానే ఉంటానని చెప్పిన ఈ అమ్మడు అందుకే ఇండస్ట్రీకి దూరమైందా అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి తాను అనుకుంటున్నట్టుగా తనకు కాబోయే వరుడు తెలుగు అబ్బాయి దొరికాడో లేదో లేక ఒంటరిగానే ఉండిపోతుందా ఏమో అంటూ రకరకాలా అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయట

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: