ప్రభాస్... మారుతి కాంబినేషన్ మూవీ విడుదల అయ్యేది అప్పుడే..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం లో తేరకెక్కిన బాహుబలి సిరీస్ మూవీ ల ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. బాహుబలి మూవీ ద్వారా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ ఆ తర్వాతి నుండి వరుస పాన్ ఇండియా మూవీ లలో మరియు అంతకు మించిన మూవీ లలో నటిస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి మారుతీ దర్శకత్వంలో తెరకెక్క బోయే ఒక మూవీ లో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇల్ ఉంటే ప్రభాస్ , మారుతి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ షూటింగ్ ఎలాంటి హడా విడి లేకుండా కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో కథ ప్రకారం ఇద్దరు హీరోయిన్ లు ప్రభాస్ సరసన నటించబోతున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ప్రభాస్ సరసన నటించ బోయే ఇద్దరు హీరోయిన్ లను ఇప్పటికే మూవీ యూనిట్ సెలెక్ట్ చేసినట్లు గా తెలుస్తుంది. ప్రభాస్ సరసన ఈ మూవీ లో నిధి అగర్వాల్ , మాళవిక మోహన్ నటించబోతున్నట్లు సమాచారం. అలాగే ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో సంజయ్ దత్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ విడుదలకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ప్రభాస్ , మారుతీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ని 2024 వ సంవత్సరం సంక్రాంతి కానుక గా విడుదల చేయాలి అని మూవీ యూనిట్ ప్రణాళికలను వేసుకున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: