చెఫ్ మంత్ర షో రీసెంట్ ప్రోమో మామూలుగా లేదుగా..!!

murali krishna
ప్రముఖ ఓటీటీ సంస్థ నిర్వహిస్తున్న షో చెఫ్ మంత్ర 2. ఈ షో కి మంచు లక్ష్మీ  గారు హోస్టుగా వ్యవహరిస్తున్న విషయం  మనకు తెలిసిందే. ఇప్పటివరకు ఈ షోలో మాళవిక మోహన్,హీరో మంచు విష్ణు, పాయల్ రాజ్ పుత్ నిహారిక,రీతు వర్మ లాంటి సెలబ్రిటీలు పాల్గొన్న విషయం  కుడా తెలిసిందే.
ఇప్పటికే మూడు ఎపిసోడ్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇది ఇలా ఉంటే తాతగా మరొక ఇంటర్వ్యూ కి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమోని విడుదల కూడా చేశారు. ఆ ప్రోమోలో షో కి టాలీవుడ్ కమెడియన్స్ బ్రహ్మానందం అలాగే ఆలీ లు హాజరయ్యారు.
ఆ ప్రోమో ని బట్టి చూస్తే ఈ ఫుల్ ఎపిసోడ్ బాగా అదిరిపోతుంది అని అర్థమవుతుంది. ఎందుకంటే కమెడియన్ బ్రహ్మానందం ఆలీ ఇద్దరూ పంచులు వేస్తూ షోలో అందరిని నవ్వించారు. కమెడియన్ బ్రహ్మానందం ఆలీల కామెడీ టైమింగ్ గురించి మనందరికీ  బాగా తెలిసిందే. కమెడియన్లుగా వీరిద్దరూ కొని వందల సినిమాలలో నటించారు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ముఖ్యంగా బ్రహ్మానందం హావభావాలు, పంచులు, సెటైర్లు ఈ షోలో ప్రత్యేక ఆకర్షణ గా నిలవనున్నాయి అని చెప్పొచ్చు, ఆయనకు తోడు ఆలీ మెరుపులు కూడా తోడయ్యాయి.
లక్ష్మి మంచు అడిగే ప్రశ్నలకు వీరిద్దరూ వారి స్టైల్లో సమాధానాలు చెప్పి ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు.
ఆ ప్రోమో లో మంచు లక్ష్మి ఆలీ గారికి ఇష్టమైన ఫుడ్ ఏంటి అని ప్రశ్నించగా.. వెంటనే బ్రహ్మానందం మనిషిని తప్ప అన్ని తింటాడు అలీ అంటూ సెటైర్ వేశాడు అలీ పై. ఆ మాటకు మంచు లక్ష్మి కడుపుబ్బా నవ్వింది అంటా మరీ. దీంతో షోలో ఉన్న వారందరూ కూడా ఒక్కసారిగా పళ్ళు మని నవ్వారు. ఆ తరువాత ఆలీ, బ్రహ్మానందం ఇద్దరూ కలిసి వంట  కూడా చేశారు. మధ్య మధ్యలో పంచులు వేస్తూ అందరిని కడుపుబ్బా నవ్వించారు. బోటి కూర లివర్ కూర తలకాయ కూర అని చెబుతుంటే మధ్యలో బ్రహ్మానందం మాట్లాడుతూ తలకాయ కూర ఎవరు తింటారు అంటే తలకాయ లేనోళ్లు అంటూ ఇలా పంచులు వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: