దర్శకుడు చందు ముండేటిని పొగిడిన పరుచూరి గోపాల కృష్ణ...!!

murali krishna
కార్తికేయ 2 సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల ప్రళయాన్ని అయితే సృష్టించింది. యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్దార్థ్‌ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఈ సినిమా నిలిచింది


ఈ ఏడాది ఆగస్టు 13న రిలీజైన ఈ మూవీ రూ.130 కోట్లకు పైగా రాబట్టింది. తాజాగా ఈ సినిమాలోని బలా బలాలను విశ్లేషించాడు పరుచూరి గోపాలకృష్ణ. 'కష్టేఫలి అన్న సూత్రం నిఖిల్‌ విషయంలో నిరూపితమైంది. కార్తికేయ 2.. బడ్జెట్‌ కంటే నాలుగు రెట్లు ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టింది. చందూ మొండేటి... ఈ జానపద కథను సాంఘిక కథగా మలిచి రాసినట్లు అనిపించిందట.. కథను నమ్మితే ఆ కథ ఎప్పుడూకూడా మనల్ని మోసం చేయదు.


సినిమాలో తల్లి సెంటిమెంట్‌ను వాడుకున్నారు. ఇద్దరు కమెడియన్స్‌ను, హీరోయిన్‌ను హీరో పక్కన పెట్టుకున్నాడు. సామాన్యంగా ఇలాంటి సినిమాల్లో ప్రేమ మిస్‌ అవుతుంది. తెలివిగా చందూ మొండేటిగారు ఏం చేశారంటే ప్రతి ఫ్రేములోనూ హీరో హీరోయిన్‌ ఉండేలా జాగ్రత్తగా రాసుకున్నారు. మధ్యలో హీరోకు ఝలక్‌ ఇచ్చి హీరోయిన్‌ వెళ్లిపోయినట్లు చీట్‌ చేసి మళ్లీ తిరిగొచ్చినట్లు కూడా చేశారు.


పాముల మధ్యలో నడుచుకుంటూ వెళ్లి హంసను తీసుకువచ్చి మురళీకి తగిలించి కృష్ణుడి చేతిలో పెట్టేవరకు కూడా అద్భుతమైన స్క్రీన్‌ప్లే అయితే రాశారు చందు మొండేటి. నాలాగా చాలా సినిమాలు రాసిన కొద్దిమంది తప్ప మామూలు ప్రేక్షకులు దాన్ని పట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు. చివర్లో కార్తికేయ 2కు సీక్వెల్‌ ఉంటుందని హింటిచ్చారు. చందూ మొండేటి అత్యంత సాహసం చేశారు. అతడి కెరీర్‌లో భారీ మొత్తంలో ఖర్చు పెట్టి మరీ సినిమా తీశారు. ఎవరికీ అమ్ముడుపోకుండా ప్రపంచానికి మంచి జరగాలనే కోరికతో దీన్ని ముగించారు. స్క్రీన్‌ప్లేలో ఎలాంటి దోషం కూడా లేదు. కావాలని కామెడీ సీన్స్‌ చొప్పించలేదు. కార్తికేయ 2ను కోట్లాది మంది చూడటం అంటే మామూలు విషయం కాదు. హీరో, దర్శకుడికి హ్యాట్సాఫ్‌' అని చెప్పుకొచ్చాడట పరుచూరి గోపాలకృష్ణ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: