రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఇప్పటికే ఎన్నో విజయవంత మైన మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే బాహుబలి మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ బాహుబలి మూవీ తర్వాత కూడా పాన్ ఇండియా మూవీ లలో , అంతకు మించిన మూవీ లలో నటిస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ తాజాగా టాలీవుడ్ క్రేజీ దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్క బోయే మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే.
ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ కి సంబంధించిన ఒక వార్త బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ , మారుతి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 22 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన ప్రభాస్ ఫోటో షూట్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. అలాగే అక్టోబర్ 23 వ తేదీన ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా ఈ మూవీ యూనిట్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో ప్రభాస్ సరసన ఇద్దరు హీరోయిన్ లు నటించబోతున్నట్లు , అందులో భాగంగా ఇప్పటికే మారుతి ప్రభాస్ సరసన హీరోయిన్ లుగా నిధి అగర్వాల్ మరియు మాళవిక మోహన్ లను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ లో సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.