మహేష్ బాబు వల్లే.. కమెడియన్ అలీ హీరోగా మారాడా?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ అలీ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఇప్పుడు వరకు కమీడియన్గా వందల సినిమాల్లో నటించిన కమెడియన్ అలీ. తనదైన హావభావాలతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు అని చెప్పాలి. ఎవరికి సాధ్యం కానీ ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో అరుదైన కామెడీని పంచి స్టార్ కమెడియన్గా ఎదిగాడు అని చెప్పాలి.

 ఒక సాదాసీదా చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలైన కమెడియన్ అలీ ప్రయాణం వందల సినిమాలు చేసిన స్టార్ కమెడియన్ రేంజ్కి ఎరిగింది అని చెప్పాలి. ఆయన కెరీర్ కమెడియన్ గా సాఫీగా సాగిపోతున్న సమయంలోనే హీరోగా ఊహించని టర్ను తీసుకున్నాడు అలీ. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యమలీల సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత బ్లాక్ బస్టర్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మదర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా మొదట యావరేజ్ టాక్ సంపాదించుకున్నప్పటికీ.. ఆ తర్వాత మాత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది.

 అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు  వల్లే కమెడియన్ అలీ హీరోగా మారాడు అన్న విషయం చాలామందికి తెలియదు. మహేష్ బాబును దృష్టిలో పెట్టుకొని దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి యమలీల స్టోరీ రాశాడట. కానీ అప్పటికి మహేష్ బాబు చిన్న పిల్లవాడు మాత్రమే. దీంతో మహేష్ హీరోగా సినిమా చేయడని కృష్ణ చెప్పేసారట. అయితే మహేష్ బాబు హీరో కావడంతో సౌందర్య కూడా సినిమా చేయడానికి ఓకే చెప్పిందట. కానీ ఆ తర్వాత కృష్ణ ఒప్పుకోకపోవడంతో హీరోగా ఆలీని పెట్టుకున్నారు. ఇక కమెడియన్ హీరోగా రావడంతో స్టార్ హీరోయిన్ సౌందర్య ఈ ప్రాజెక్టు నుంచి తప్పకుంది. ఇంద్రజ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హీరోగా అలీకి హీరోయిన్ గా ఇంద్రజకి కూడా ఊహించును రీతిలో క్రేజ్ తెచ్చిపెట్టింది ఈ సినిమా. ఇలా మహేష్ బాబు సినిమా చేయకపోవడం వల్లే అలీ హీరోగా అరంగేట్రం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: