పుష్ప 2: సొంత స్టూడియోలోనే భారీగా...?

Purushottham Vinay
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'పుష్ప : ది రైజ్'. చాలా సైలెంట్ గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 'పుష్ప' మేనియా దుమ్ములేపింది.ఇప్పుడు 'పుష్ప 2'  సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.  పుష్ప క్రియేట్ చేసిన సెన్సేషన్ తో సీక్వెల్ పై మరింతగా అంచనాలు ఏర్పడ్డాయి. 'పుష్ప2'ను మరింత గ్రాండ్ గా తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఈ సంద్భంగా సినిమా కోసం అల్లు స్టూడియోలో భారీ సెట్ కూడా వేయిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది.దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. దానికి తోడు పార్ట్ 2లో మరిన్ని పాత్రలు యాడ్ అవుతాయని, గ్రాండ్ విజువల్స్ ఉంటాయని అంటున్నారు. ఇంకా అలాగే సమంత, ప్రియమణిని కూడా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.ఈ క్రమంలో తాజాగా సినిమాపై క్రేజీ అప్డేట్ అందింది.


సీక్వెల్ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభానికి గత నెలలోనే పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెలాఖరులో సీక్వెల్ ను సెట్స్ పైకి తీసుకెళ్లనునన్నట్టు సమాచారం. టీం కూడా షూటింగ్ కు రెడీ అవుతోంది.అయితే రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభమైన 'అల్లు స్టూడియో' లోనే 'పుష్ప 2' షూటింగ్ ప్రారంభం కానుందట. ఇందుకోసం భారీ మార్పులు కూడా చేశారంట. అలాగే షూటింగ్ కోసం పెద్ద సెట్ కూడా వేయించారట దర్శకుడు సుకుమార్.ఇప్పటికే బ్యాంకాక్ ఫారెస్ట్ ఏరియాలో సినిమా షూటింగ్ ను ప్రారంభించాలని అనుకున్నారంట సుకుమార్.. కానీ అక్కడ అనుమతి లేకపోవడంతో ఆలస్యం అయ్యిందని తెలుస్తోంది. దీంతో ఏకంగా అదే ఫారెస్ట్, కెన్యా పర్వతాలను తలపించేలా భారీ సెట్ ను అల్లు స్టూడియోలో ప్లాన్ చేస్తున్నారంట. ఇందుకోసం భారీగానే ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తోంది.మరి చూడాలి ఈ సినిమా ఎంత పెద్ద ఘనవిజయం సాధిస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: