నయనతార-విఘ్నేశ్ దంపతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తాజాగా నయనతార-విఘ్నేశ్ దంపతులు కవల పిల్లలకు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. అయితే తమకు ఇద్దరు మగ పిల్లలు(కవలలు) జన్మించారంటూ ఇటీవలే సోషల్మీడియా ద్వారా తెలిపారు.ఇకపోతే దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది. ఎందుకంటే వీరికి పెళ్లై ఇంకా నాలుగు నెలలే అవుతోంది. అయితే అందులోనూ వీరు సరోగసి ద్వారా తల్లిదండ్రులు అయ్యారు. ఇక దీంతో వారిద్దరిపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి.అంతేకాదు అలాగే సరోగసి విధానం ద్వారా తల్లిదండ్రులుగా మారిననయనతార-విఘ్నేశ్ శివన్ తమకు పిల్లలు ఎలా పుట్టారో వివరణ ఇవ్వాలంటూ తమిళనాడు ప్రభుత్వం నయన్ దంపతులకు నోటీసులు జారీ చేసింది.
ఇక దీనిపై ఇప్పటివరకు ఈ జంట నయనతార-విఘ్నేశ్ స్పందించలేదు.ఇదిలావుంటే ఇక తాజాగా విఘ్నేష్ శివన్ తన ఇన్స్టాలో షేర్ చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. అయితే ఇందులో ‘అన్ని విషయాలు సరైన సమయంలో మీకు తెలుస్తాయి.ఇక అప్పటివరకు ఓపికపట్టండి...ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండండి’ అని అందులో రాశారు.అయితే ఇప్పుడీ పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. అయితే ఇక.సరోగసి విధానం ద్వారా తల్లిదండ్రులుగా మారిన నయనతార-విఘ్నేశ్ శివన్ ఈ విషయం పై నేరుగా స్పందించకుండా ఇలా పరోక్షంగా స్పందించారని నెటిజన్లు భావిస్తున్నారు.
ఇకపోతే సుమారు ఏడేళ్ల నుంచి ప్రేమలో ఉన్న నయనతార-విఘ్నేశ్ శివన్ కుటుంబసభ్యుల సమక్షంలో మహాబలిపురంలో జూన్ 9న పెళ్లి బంధంతో ఏకమయ్యింది. అయితే మహాబలిపురంలో అంబరాన్ని అంటేలా ఓ సుందరమైన పెళ్లి వేదికలో జరిగిన ఈ కళ్యాణ వేడుక డాక్యుమెంటరీ రూపంలో త్వరలోనే నెట్టింట్లో సందడి చేయనుంది.ఇక ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్’ అనే టైటిల్తో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇక పోతే దసరాకు విడుదలైన ‘గాడ్ ఫాదర్’తో విజయాన్ని అందుకున్న నయన్. ‘కాతువాకుల రెండు కాదల్’'తో ఈ ఏడాది ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు విఘ్నేశ్తో తదుపరి అజిత్ సరసన ఓ సినిమా చేయనున్నారని ఇటీవలే ప్రకటించారు..!!