తాప్సి.. కంగన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా..!!

Divya
బాలీవుడ్లో కంగన రనౌత్, తాప్సి ప్రతి ఒక్కరికి సుపరిచితమే వీరిద్దరూ ఏదైనా విషయాన్ని ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారని చెప్పవచ్చు. టాలీవుడ్ లో ఉన్నంతకాలం వీరిద్దరూ చాలా సైలెంట్ గా ఉండేవారు. కానీ బాలీవుడ్ వైపుకు వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా వీరిద్దరిలో పలు మార్పులు వచ్చాయి. దీంతో వీరిద్దరూ రియల్ గా ఇలా ఉంటారా అన్నట్లుగా వీరి అభిమానులు అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఇక ఇదంతా పక్కన పెడితే కంగానా తమిళనాడు దేవాలయ మదురై పర్యటనలో భాగంగా రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. త్వరలోనే తన రాజకీయాల్లోకి వస్తానని మధురై నుంచి రంగంలోకి దిగుతానని తెలియజేయడం జరిగింది.

ఇక అప్పటినుంచి కంగాన  మరొకసారి బాలీవుడ్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. ఇక సినీ ఇండస్ట్రీని అల్లకల్లోలం చేస్తున్న ఈ ముద్దుగుమ్మ  ఇక రాజకీయాలలోకి వెళితే ఎలా ఉంటుందో అంటూ మరికొందరు ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే తాజాగా కంగానా తాప్సిల సత్తా గురించి బాలీవుడ్ నటి గుల్ పనగ్ మాట్లాడిన విషయాలు వైరల్ గా మారుతున్నాయి. కంగాన యాక్టివ్ పొలిటికల్స్ లో ఉంటుందంటే తాప్సి కూడా అదే చేసే అవకాశం ఉందని బదిలిస్తున్నారు ప్రేక్షకులు. అయితే వీరిద్దరికి బదులుగా అంతటి ధైర్యం చూపించి వ్యక్తి ఇంతవరకు చూడలేదు..రాబోయే రోజులలో వీరిద్దరికీ ఏం కావాలో వీళ్లే నిర్ణయించుకుంటారని తెలియజేసింది నటి.

కంగనా ని ప్రతి విషయంలో ఆమె సమర్థిస్తూ పోరాడుతూ ఉంటుంది. ఆమెలో తనకు నచ్చిన విషయాలు ఈమెకు చాలానే ఉన్నాయి.. ముఖ్యంగా ఆమెలో తెగింపు ధైర్యం తెలివైన అమ్మాయిగా ఉండడం తాప్సికి నచ్చుతుంది అలాంటి క్వాలిటి సే మళ్లీ తాప్సీలో కూడా కనిపించాయని బాలీవుడ్ నటి గుల్ పనగ్ తెలియజేసింది. మొత్తానికి వీరిద్దరిని బాగానే విశ్లేషించింది ఈమె ఇలా తినాల్సిస్ చేసిందంటే తక్కువ అంచనా వేయడానికి వీలులేదని తెలియజేస్తోంది ఇమే. ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ లో చాలా హాట్ టాపిక్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: