ఒక్క పంచ్ తో.. అఖిల్ పరువు తీసేసిన హైపర్ ఆది?
షో ఏదైనా సరే తనదైన కామెడీ టైమింగ్ తో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు అని చెప్పాలి. ఢీ షో తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి కార్యక్రమంలో కూడా కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. ఇకపోతే ఢీ షో లో సుధీర్ రష్మి దూరమైన తర్వాత హైపర్ ఆది షో భారం మొత్తం తన భుజాల మీద వేసుకుని ముందుకు నడిపిస్తున్నాడు అని చెప్పాలి. జడ్జిల పైన కూడా సెటైర్లు వేస్తూ కామెడీ పంచుతూ ఉంటాడు. ఆది తో పాటు టీం లీడర్గా ఉన్న బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ ను తన పంచులతో ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటాడు హైపర్ ఆది.
ఇక ఈ వారం ప్రసారం కాబోయే ఢీ ఎపిసోడ్ లో అఖిల్ మీద దారుణమైన పంచులు వేసాడు హైపర్ ఆది. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్ని నెలలు అయింది అని అఖిల్ ని అడుగుతాడు హైపర్ ఆది. పదేళ్లు అయింది అని అఖిల్ సమాధానం చెబుతాడు. అబ్బో పదేళ్లు అంటే ఎంత సంపాదించి ఉంటావ్ అంటూ అడుగుతాడు హైపర్ ఆది. దీంతో బాగానే సంపాదించాను అంటూ అఖిల్ సమాధానం చెబుతాడు. ఈ పదేళ్లు ఏం చేయకుండానే ఇంత సంపాదించావంటే.. ఏమైనా చేసి ఉంటే ఇంకా ఎంత సంపాదించే వాడివో అంటూ అఖిల్ పరువు మొత్తం తీసేసాడు హైపర్ ఆది. ఇలా అఖిల్ కు నటించడం రాదు అని ఇండైరెక్ట్గా సెటైర్ వేశాడు అని అభిమానులు అనుకుంటున్నారు.