వెన్నెల కిషోర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన మంచు విష్ణు.. అహంకారి అంటూ..!

Divya
కలెక్షన్ కి మోహన్ బాబు వారసుడుగా మంచు విష్ణు నిర్మాతగా , నటుడుగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు . ఇకపోతే ఇటీవల ఈయన నటించిన జిన్నా చిత్రం అక్టోబర్లో రిలీజ్ కి సిద్ధమవుతోంది. 24 ఫ్రేమ్స్, ఫ్యాక్టరీ బ్యానర్స్ లో సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే పలువురు తమ అంచనాలను పెంచుకుంటున్నారు . ఇకపోతే ఈషాన్ సూర్య దర్శకుడిగా , అందాల భామలు పాయల్ రాజ్ పుత్,  సన్నిలియోన్ హీరోయిన్ గా నటిస్తున్నారు ఇక ప్రముఖ దర్శకుడు జీ నాగేశ్వర్ రెడ్డి కథ అందించిన ఈ చిత్రానికి కోనా వెంకట్ సాహిత్యాన్ని , మాటలను అందించారు. ఇకపోతే ఈ సినిమా టీజర్ ఆవిష్కరణ సందర్భంగా మంచు విష్ణు కొన్ని విషయాలను వెల్లడించడం జరిగింది.
ముందుగా మంచు విష్ణు దర్శకుడు జీ నాగేశ్వర్ రెడ్డి గురించి మాట్లాడుతూ జిన్నా సినిమాకు ఈయన కథను అందించారు.  నేను వైఫల్యాలతో ఉన్న సమయంలో ఆయన నాకు సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు. దేనికైనా రెడీ సూపర్ హిట్ అయింది. ఇక కరెంట్ తీగ , వాడో రకం వీడో రకం అంటూ మూడు సినిమా హిట్లను ఇచ్చిన వ్యక్తిని ఎలా మర్చిపోతాను అంటూ విష్ణు తెలిపారు.
ఇక వెన్నెల కిషోర్ గురించి మాట్లాడుతూ.. కమెడియన్ వెన్నెల కిషోర్ నాకు మంచి మిత్రుడు కానీ అతడికి ఉన్న అహంకారం ఎవరికి ఉండదు.. అహంకారం ముందు పుట్టి తర్వాత వాడు పుట్టాడేమో అనిపిస్తుంది.  అతడు మర్యాద ఇచ్చినట్టు కనిపిస్తాడు కానీ నాపై చాలా వ్యంగ్యంగా మాట్లాడుతాడు.  అతడిని నేను ఏమీ అనలేను.. ఎందుకంటే వెన్నెల కిషోర్ అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం . అయితే నా మాటలు విన్న తర్వాత ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టకు అని మంచు విష్ణు చురకలు అంటించారు. ఇకపోతే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: