క్యాష్ షోలోకి రాజమౌళి.. షాకింగ్ ప్రశ్న అడిగిన సుమా?

praveen
ప్రస్తుతం తెలుగు బుల్లితెర ఫై నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతుంది సుమ. ప్రస్తుతం ఎంతో మంది యాంకర్లు ఉన్నప్పటికీ సుమా కి ఇప్పటివరకు ఎవరూ సాటి రాలేదు అని చెప్పాలి.  దాదాపు రెండు దశాబ్దాల నుంచి మకుటంలేని మహారాణి లాగా యాంకరింగ్ రంగంలో చక్రం తిప్పుతుంది   ఈ క్రమంలోనే ప్రస్తుతం బుల్లితెరపై కార్యక్రమాలతో బిజీగా ఉండడమే కాదు అటు సినిమా ఈవెంట్ లో ఎక్కడ చూసినా యాంకర్ సుమ దర్శనమిస్తుంది అని చెప్పాలి. ఎప్పుడూ తన వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకుంటుంది స్పాంటేనియస్ పంచ్ లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుంది.

 అయితే ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారమయ్యే క్యాష్ షోలో కూడా యాంకరింగ్ చేస్తోంది అన్న విషయం తెలిసిందే.  ప్రతి వారం కూడా నలుగురు గెస్ట్ లను క్యాష్ షో లోకి ఆహ్వానించడం ఇలా షో లోకి వచ్చిన సిని సెలబ్రెటీలతో ఫన్నీ టాస్క్ లు ఆడించడం తన స్పాంటేనియస్ పంచులతో ప్రేక్షకులందరికీ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందించడం లాంటివి చేస్తూ ఉంటుంది సుమా. అప్పుడప్పుడు పలు సినిమా బృందాలు ప్రమోషన్స్ కోసం కూడా క్యాష్ షో కి వస్తూ ఉంటాయి. ఇటీవలే బ్రహ్మాస్త్ర చిత్రబృందం క్యాష్ షో లో ప్రమోషన్ చేయడానికి వచ్చింది.

 ఇక చిత్ర బృందం తోపాటు దర్శకధీరుడు రాజమౌళి కూడా మొదటిసారి క్యాష్ స్టేజ్ మీద అడుగు పెట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎప్పటిలాగానే సుమ తనదైన ప్రశ్నలతో ఫన్నీ టాస్క్ లతో ప్రేక్షకులను అలరించింది అని చెప్పాలి. అయితే ఇటీవల విడుదలైన ప్రోమో వైరల్ గా మారింది. కాగా సుమ అడిగిన ఒక ప్రశ్నకు రాజమౌళి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. మీ దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా లో ఎన్టీఆర్ కు న్యాయం చేశారా లేకపోతే రామ్ చరణ్ కు న్యాయం చేశారా అంటూ సుమ ప్రశ్న అడుగుతుంది. దీంతో అటు రాజమౌళి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ తర్వాత ఏదో మాట్లాడాడు. కానీ ఇదంతా మ్యూట్ చేసి చూపించారు. దీంతో రాజమౌళి ఏం సమాధానం చెప్పి ఉంటారా అని అందరిలో ఆసక్తి పెరిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: