హరీష్ శంకర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయిన విజయ్ దేవరకొండ తాజాగా లైగర్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా , బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ మూవీ లో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించింది. మైక్ టైసన్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించగా , రమ్యకృష్ణ ఈ మూవీ లో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో నటించింది.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను తీవ్ర స్థాయిలో నిరుత్సాహపరిచింది. ఇది ఇలా ఉంటే లైగర్ మూవీ సెట్స్ పై ఉండగానే విజయ్ దేవరకొండ 'ఖుషి' అనే మూవీ ని ప్రారంభించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సమంత హీరోయిన్ గా నటించగా శివ నిర్వాణ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఖుషి మూవీ షూటింగ్ 70 శాతం వరకు పూర్తి అయినట్లు తెలుస్తోంది.  

ఇది ఇలా ఉంటే లైగర్ మరియు ఖుషి మూవీ లు సెట్స్ పై ఉండగానే విజయ్ దేవరకొండ , పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జన గణ మన అనే మూవీ కి కమిట్ అయ్యాడు. కాకపోతే ప్రస్తుతం లైగర్ మూవీ బాక్సా ఫీస్ దగ్గర  పరాజయం చెందడంతో జన గణ మన మూవీ కొన్ని రోజుల పాటు హోల్డ్ లో ఉండే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దానితో విజయ్ దేవరకొండ మరో దర్శకుడు తో మూవీ ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం విజయ్ దేవరకొండ , హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: