ఈస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ రాబోతుందా..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పూరి జగన్నాథ్ ఇప్పటికే ఎన్నో హిట్ , సూపర్ హిట్ , బ్లాక్ బస్టర్ మూవీ లకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా కొనసాగుతున్నాడు.

ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల పాటు వరుస పరాజయాలను బాక్సా ఫీస్ దగ్గర ఎదుర్కొన్న పూరి జగన్నాథ్ , రామ్ పోతినేని హీరోగా నబా నాటేష్ ,  నిధి అగర్వాల్ హీరోయిన్ లుగా తెరకెక్కిన ఈస్మార్ట్ శంకర్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని మళ్లీ తిరిగి ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఇలా ఈస్మార్ట్ శంకర్ మూవీ తో అదిరిపోయే విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకున్న పూరి జగన్నాథ్ తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా బాక్సింగ్ నేపథ్యంలో లైగర్ అనే మూవీ ని తెరకెక్కించాడు.  లైగర్ మూవీ భారీ అంచనాల నడుమ ఆగస్టు 25 వ తేదీన తెలుగు , తమిళ , హిందీ ,  మలయాళ , కన్నడ భాషలలో విడుదల అయ్యింది. ఈ మూవీ లో మైక్ టైసన్ ఒక ముఖ్య పాత్రలో నటించగా ,  రమ్యకృష్ణ ఈ మూవీ లో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో నటించింది.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజే నెగటివ్ టాకును తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే పూరి జగన్నా తనకు చాలా రోజుల తర్వాత మంచి విజయాన్ని తీసుకువచ్చిన ఈస్మార్ట్ శంకర్ మూవీ కి సీక్వెల్ గా ఈస్మార్ట్ శంకర్ 2 మూవీ ని తిరకెక్కించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: