పైసా ఖర్చు లేకుండా నయన్ దంపతుల హనీమూన్ ట్రిప్.. ఎలాగంటే..?

Anilkumar
సాధారణంగా పెళ్లైన జంట  పెళ్లి తరువాత ఏకాంతాన్ని కోరుకుంటారు.అయితే  అందులో భాగంగానే వారు కొన్ని ప్రాంతాల్లో విహరిస్తారు. ఇక దాన్నే నేటి ఆధునిక యుగంలో హనీమూన్ అంటాం.అయితే ప్రస్తుతం ఈ కల్చర్ ప్రపంచం అంతటా ఉంది. ఇక ఈ క్రమంలోనే తాజాగా పెళ్లైన నయన్ – విఘ్నేశ్ల జంట స్పెయిన్ లో హనీమూన్ ట్రిప్ ను తెగ ఎంజాయ్ చేస్తోంది.ఇటీవల వీరిద్దరికి అంగరంగ వైభవంగా వివాహం జరిగిన విషయం తెల్సిందే.ఇకపోతే     ఇప్పుడు వీరి హనీమూన్ ట్రిప్ గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.అయితే  ఆ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

కాగా నయనతార-విఘ్నేశ్ శివన్ జంట గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అంతేకాదు  6 ఏళ్లుగా ప్రేమ ప్రయాణం చేసిన ఈ జంట రెండు నెలల క్రితం ఒక్కటైన విషయం అందరికి తెలిసిందే. ఇక పెళ్లి తర్వతా ఈ జంట హనీమూన్ కోసం విదేశాల్లో విహరిస్తున్నారు. అయితే దానికి సంబంధించిన ఫొటోలను నయన్ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూనే ఉంది. ఇకపోతే  ఇప్పుడు వీరి గురించి ఓ వార్త ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది.ఇక అదేంటంటే వీరి హనీమూన్ ట్రిప్ కు ఒక్క పైసా కూడా తమ జేబుల్లోంచి పెట్టడం లేదంట. 

అంతేకాదు అలాగే వారి హోటల్ రూం అద్దె, వారి ఇతర ఖర్చులను ఒక ప్రముఖ కంపెనీ స్పాన్సర్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకైతే ఈ నవ జంట ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇకపోతే  ఈ వార్త విన్న కొందరు నెటిజన్స్ స్పందిస్తూ.. ”ఆహా దేనికైనా పెట్టి పుట్టాలి అంటూ.. ఈ అవకాశం మాకు ఇవ్వండి” అంటూ ఆ కంపెనీని సరదాగా కోరుతున్నారు.ఇక ప్రస్తుతం నయనతార సినిమాల విషయానికొస్తే.. బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్ ఖాన్ సరసన జవాన్ అనే సినిమాలో నటిస్తోంది. తమిళ దర్శకుడు అట్లీ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది విడుదల కాబోతున్న ఈ సినిమాలో కోలీవుడ్ అగ్ర హీరో విజయ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: