సోషల్ మీడియాను ఏలేస్తున్న సౌత్ స్టార్ హీరోలు వీళ్లే..!!

Divya
ముఖ్యంగా హీరో హీరోయిన్ల క్రేజ్ డిసైడ్ చేసేది ఒక్క సోషల్ మీడియానే అని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ఎవరికి ఎక్కువ ఫాలోవర్స్ వుంటారో ఇక వారే అధికంగా క్రేజ్ కలిగిన హీరోలు హీరోయిన్లు అని అంటూ ఉంటారు.. ఇకపోతే ఈమధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాలు వచ్చిన తర్వాత సినీ సెలబ్రిటీలకు విపరీతంగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఒకప్పటి అభిమాన సంఘాల స్థానంలో ఇప్పుడు ఇవి అందుబాటులోకి రావడం గమనార్హం. అందుకే సెలబ్రిటీలకు కూడా ఎక్కువగా సోషల్ మీడియా ఖాతాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉండడం జరుగుతుంది. అంతేకాదు సోషల్ మీడియా ఫాలోయింగ్ కోసం మన స్టార్ హీరోలు కూడా లక్షల్లో జీతాలు ఇచ్చి ఒక టీం ని కూడా మైంటైన్ చేస్తున్నారు. ఇకపోతే దాదాపు అన్ని భాషల సెలబ్రెటీలు సోషల్ మీడియాకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే సౌత్ ఇండియా ను ఏలేస్తున్న మన స్టార్ హీరోలు కూడా ఉన్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియా ఖాతాలో 46.8 మిలియన్ల మంది ఫాలోవర్స్ ను అల్లు అర్జున్ సొంతం చేసుకోవడం గమనార్హం. ముఖ్యంగా సౌత్ సినీ ఇండస్ట్రీలో ఇతనొక్కడే ఈ రేంజ్ లో సోషల్ మీడియాలో దూసుకుపోతుండడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.  నిజానికి పుష్ప సక్సెస్ తోనే అటు బాలీవుడ్,  ఇటు సౌత్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు లభించింది. ఈ క్రమంలోనే ఈయనకు విపరీతంగా ఫాలోవర్స్ కూడా పెరిగి పోయారు. అందుకే సోషల్ మీడియాలో నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్.
ఆ తర్వాత స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు 36.7 మిలియన్ మంది ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు. నిజానికి ఈయన పాన్ ఇండియా లెవెల్లో ఒక్క సినిమా చేయకపోయినా కూడా సోషల్ మీడియాలో ఈ రేంజ్ లో ఫాలోవర్స్ ను కలిగి ఉండడం గమనార్హం. ఇక ఈయన తర్వాత స్థానంలో ప్రభాస్ నిలిచాడు. బాహుబలి సినిమా తర్వాత ఈయన క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది . ఇక అలా సోషల్ మీడియాలో 34.2 మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు. ఇక వీరి తర్వాత విజయ్ దేవరకొండ 30.1 మిలియన్ ఫాలోవర్స్,  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 22.9 మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: