కార్తికేయ-2 సినిమాపై ప్రశంసలు కురిపించిన వర్మ..!!

Divya
యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన తాజా చిత్రం కార్తికేయ -2 ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఘన విజయాన్ని అందుకున్నది. ఈనెల13వ తేదీన సినిమా పాన్ ఇండియా చిత్రంగా పేరు పొందింది. ఇక తెలుగు రాష్ట్రాలలో కంటే హిందీలో హౌస్ ఫుల్ కలెక్షన్లలో దూసుకుపోతోంది. దీంతో ఈ సినిమా 100% సక్సెస్ అయిందని చెప్పవచ్చు.. తెలుగు మార్కెట్ ను మించి బాలీవుడ్ లో ఈ సినిమా కలెక్షన్ల పరంగా పరుగులు పెట్టడంతో బాలీవుడ్ చిత్రాలు సైతం వెనక్కి నెట్టి బాక్సాఫీస్ రేసులో ముందుకు వెళ్తోంది.

తాజాగా ఈ చిత్రపరి పరిమాణాన్ని తీసుకొని రాంగోపాల్ వర్మ ఈ చిత్రం పైన ఇంట్రెస్టింగ్ గా ఒక ట్వీట్ చేయడం జరిగింది. నిఖిల్ నటించిన కార్తికేయ -2 సినిమా అభిషేక్ నిర్మించిన చిత్రం విడుదల రెండో వారం కూడా మంచి కలెక్షన్లను అందుకుంటోంది. ముఖ్యంగా హిందీలో బెస్ట్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా , అక్షయ్ కుమార్ నటించిన రక్షాబంధన్ సినిమాల కంటె ఎక్కువ కలెక్షన్లను సాధిస్తుంది కార్తికేయ -2 చిత్రమని తెలిపారు. పెట్టుబడి మిద వచ్చిన ఆదాయం తో పోల్చినట్లు అయితే రాజమౌళి తెరకెక్కించిన RRR, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన kgf -2 కంటే కార్తికేయ -2 సినిమా ఒక గొప్ప చిత్రమని తెలిపారు.

డైరెక్టర్ చందు మండేటికి కంగ్రాజులేషన్స్ తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ట్విట్ కాస్తంత వైరల్ గా మారుతోంది. ఈ సినిమాని కేవలం 15 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు ప్రపంచవ్యాప్తంగా అప్పుడే 60 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది మరో 40 కోట్లు సాధిస్తే కచ్చితంగా 100 కోట్ల క్లబ్లో చేరిన ఆశ్చర్యం లేదని విధంగా తెలిపారు వర్మ. సాధారణంగా ఇలాంటి రికార్డు కేవలం బాలీవుడ్ కి ఎక్కువగా వస్తాయి అలాంటిది అతి తక్కువ బడ్జెట్ తో .. తెరకెక్కించిన చిత్రాలు 200 కోట్ల రూపాయలు వసూలు సాధించడం చాలా గమనార్హం అని తెలిపారు. ప్రస్తుతం వర్మ ట్వీట్ వైరల్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: