మెగాస్టార్ కు విలన్ కష్టాలు తప్పలేదుగా..!

Satvika
తెలుగు చిత్ర పరిస్రమ తో పాటు ప్రతి ఒక్క ఇండస్ట్రీ లో చిరంజీవి పేరు అందరికి తెలిసే ఉంటుంది..వయస్సు పెరిగిన ఒంట్లో శక్తీ తగ్గలేదు అంటూ వరుస సినిమాలను చేసుకుంటూ వస్తున్నాడు.10 సినిమాలను చేతిలో పెట్టుకున్నాడు. కాగా, ఇప్పుడు ఆయన నటిస్తున్న గాడ్‌ఫాదర చిత్రం చివరిదశ షూటింగ్ జరుపుకుంటోంది.ఇక ఈ సినిమాను తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా తరువాత చిరు తన నెక్ట్స్ చిత్రాలను మెహర్ రమేష్, బాబీ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాల షూటింగ్ కూడా మొదలైంది..

బాబీ తో నెక్స్త్ సినిమాను చేయనున్న విషయం తెలిసిందే.సినిమాకు మెగా154 అనే వర్కింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాను పూర్తిగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు బాబీ రెడీ అవుతున్నాడు. కాగా.. ఈ సినిమాలో విలన్ పాత్ర కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. అందుకే ఈ సినిమాలో విలన్ కొత్తగా ఉంటే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఈ క్రమంలో పలువురు పేర్లను పరిశీలించిన దర్శకుడు బాబీ, చివరకు ఈ సినిమాలో నటుడు ఆర్.మాధవన్‌ను సెలెక్ట్ చేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి..

హీరోగా తమిళ, హిందీ భాషల్లో తనకంటూ అదిరిపోయే క్రేజ్ తెచ్చుకున్న ఈ యాక్టర్, ప్రస్తుతం తన ఏజ్‌కు తగ్గట్టుగా క్యారెక్టర్, విలన్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. అయితే అక్కినేని నాగచైతన్య నటించిన 'సవ్యసాచి' సినిమాలో విలన్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించడంలో మాధవన్ సక్సెస్ అయ్యాడు. దీంతో ఇప్పుడు చిరును ఢీకొనే పాత్రలో మాధవన్ అయితే పర్ఫెక్ట్‌గా ఉంటాడని దర్శకుడు బాబీ అనుకుంటున్నాడట. ఈ మేరకు మాధవన్‌ను విలన్ పాత్రలో నటించేందుకు చిత్ర యూనిట్ సంప్రదింపులు కూడా చేస్తున్నట్లుగా వార్తలు చక్కర్లు కోడుతున్నాయి.శృతి హాసన్ జంటగా నటిస్తుంది.. ఈ విలన్ గా ఎవరూ చేస్తా రో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: