నిర్మాతగా మారనున్న మరో వారసురాలు..!

Divya
ఇటీవల కాలంలో చాలా మంది సినిమాలలో నటించడం కంటే నిర్మాణ విభాగంలో బాధ్యతలు చేపట్టడం చాలా సులభమని ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో వారసురాలు ఇండస్ట్రీలోకి నిర్మాతగా అడుగుపెట్టబోతోంది. ఆమె ఎవరో కాదు ప్రముఖ డాషింగ్ , డేరింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర. సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తోంది అనే విషయం పక్కన పెడితే నిర్మాతగా రంగం సిద్ధం చేసుకుంటోంది అనే వార్త వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చక్రం తిప్పుతున్నారు . టాలీవుడ్లో నిర్మాత గా కూడా ఎంతో సుదీర్ఘమైన ప్రస్థానం ఉంది. ఇక ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా దర్శకుడిగా ఎదిగే అదృష్టం లభించడం గమనార్హం.
ఇక తాజాగా ఆయన తదనంతరం వారసత్వం కొనసాగేలా వారసుడిని సైతం రంగంలోకి దింపారు. ఆకాష్ పూరి కూడా ఇప్పుడిప్పుడే హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరోక వైపు  నిర్మాతగా పూరి తన అభిరుచిని చాటుకున్నారు. ఇకపోతే వైష్ణో అకాడమీ పేరుతో నిర్మాణ రంగంలోకి దిగిన పూరి జగన్నాథ్ అదే సంస్థని పూరీ కనెక్ట్స్ గా మార్పు చేసి నటి ఛార్మి ని భాగస్వామ్యం చేసుకొని ఆ బాధ్యతలు ఆమెకి అప్పగించారు పూరి జగన్నాథ్. ఇప్పుడు ఆ బరువు బాధ్యతలు పూరి తనయ పవిత్ర కూడా భాగస్వామ్యం అవుతున్నట్లు సమాచారం. ఇటీవల పవిత్ర ఎంబీఏ పూర్తి చేసింది. ఈ నేపథ్యంలోనే ఈమె బిజినెస్ మేనేజ్మెంట్ చేసి ఇలా నిర్మాణ రంగంలో ఎంటరైంది ఈ చిన్నారి.
తండ్రి సూచనలు, సలహాల మేరకు నిర్మాణరంగంలో సక్సెస్ దిశగా అడుగులు వేస్తోంది. ఆకాష్ పూరి కూడా ఇటీవల పవిత్ర నిర్మాతగా ఎంట్రీ ఇస్తుందని రివీల్ కూడా చేశారు . ఇకపై పూరీ కనెక్ట్స్ బాధ్యతలను పూర్తిగా పవిత్ర చేతుల్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఒక వైపు తండ్రి స్టార్ డైరెక్టర్.. బ్రదర్ కాబోయే స్టార్.. ఇక అందుకే తెలివిగా పవిత్ర బిజినెస్ మేనేజ్మెంట్ చేయించి పూరి జగన్నాథ్ నిర్మాత గా దింపుతూ ఉన్నట్లు సమాచారం. మరి పవిత్ర నిర్మాతగా సెటిల్ అవుతుందో లేదో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: