ఏడేళ్ల ప్రేమకు పట్టాభిషేకం.. ఏడు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న నయన్, విఘ్నేష్.. నేడు మూడు మూళ్ల బంధంతో ఎకమయ్యారు.ఇకపోతే తమిళనాడులోని మహాబలిపురంలో ఓ హోటల్ వేదికగా వీరిద్దరి వివాహం అత్యంత ఘనంగా జరిగింది.అయితే వీరి పెళ్లికి దక్షిణాది సినీ ప్రముఖులే కాకుండా బాలీవుడ్ సెలబ్రెటీస్ సైతం హజరయ్యారు. అంతేకాకుండా షారుఖ్ ఖాన్, నిర్మాత బోనీ కపూర్, డైరెక్టర్ అట్లీ, కార్తీ, సూర్య, రజినీ కాంత్, విజయ్ దళపతితోపాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. కాగా వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. పోతే కాసేపటి క్రితం ఇద్దరం ఒక్కటయ్యామంటూ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తమ పెళ్లి ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
తాజాగా ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో వీరిద్దరి పెళ్లికి సంబంధించిన కట్నకానుకల గురించి చర్చ నడుస్తోంది...అయితే ఈమె లేడీ సూపర్ స్టార్ గా సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నయనతార. పోతే దక్షిణాది చిత్రపరిశ్రమలోనే అగ్రకథానాయికలలో అందరికంటే ఎక్కువగా పారితోషికం తీసుకుంటూ వరుస ఆఫర్లతో దూసుకుపోయింది. ఇకపోతే హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ నయనతార మాత్రమే. అయితే ఈమె ఒక్కో సినిమాకు దాదాపు అయిదు కోట్ల పారితోషికం తీసుకుంటుందట. అంఅంతేకాదు ఇప్పుడిప్పుడే విఘ్నేష్ శివన్ దర్శకుడిగా సక్సెస్ ఫుల్ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు.ఇకపోతే పెళ్లికి ముందు వీరిద్దరు ఒకరికొకరు ఖరీదైన బహుమతులు ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ముఖ్యంగా నయనతార చెన్నైలోని అత్యంత ఖరీదైన ఏరియాలోని పాతికకోట్లు పెట్టి ఓ ఇంద్రభవనం లాంటి ఇంటిని కొనుగోలు చేసిందట. అయితే ఆ ఇంటిని తన భర్త విఘ్నేష్ శివన్ కు బహుమతిగా ఇచ్చిందట.కాగా మరోవైపు విఘ్నేష్ సైతం నయన్ కు ఖరీదైన బంగారు ఆభరణాలతోపాటు వస్తువులను కూడా బహుమానంగా ఇచ్చాడని సమాచారం. ఇదిలావుండగా వివాహంలో వీరిద్దరు ధరించిన దుస్తులు, నగల ఖరీదు దాదాపు 5 కోట్లు ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే వీరి పెళ్లికోసం సరికొత్తగా డైమండ్ రింగ్స్ చేయించుకున్నారని...ఇక వాటి విలువ ఒక్కొటి కోటి రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే వీరి పెళ్లి రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ దాదాపు మూడు రెట్ల అధికంగా చెల్లించి తీసుకుందని టాక్ వినిపిస్తోంది...!!