టాలీవుడ్ కు అప్ కమింగ్ హీరోయిన్ ఈమెనట..!!

Divya
టాలీవుడ్ లో మెజారిటీ స్టార్ హీరోయిన్ ఎక్కువగా ఉత్తర భారతదేశం నుండి వచ్చిన వారే ఉన్నారు. మరికొందరు మాత్రం మలయాళం నుంచి తమిళం నుండి వచ్చిన వారు కూడా ఉన్నారు. ఎక్కువ మెజారిటీ మాత్రం ముంబాయి, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో మరొక కొత్త హీరోయిన్ ఉత్తరాది భామ స్థిరపడెందుకు సిద్ధమయ్యింది. గని చిత్రంతో తొలిసారిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోయిన్ సాయి మంజ్రేకర్ తన మొదటి చిత్రంతో నిరాశకు గురైంది. ఇక ఆ తర్వాత మళ్లీ తెలుగులో ఈమెకు అవకాశాలు రావడమే గగనం అన్నట్లుగా తెలుస్తోంది.
అయితే ఈమె గని సినిమాతో పాటు మేజర్ చిత్రంలో కూడా నటించింది ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇక గని చిత్ర సమయంలో సాయి మంజ్రేకర్ గురించి పెద్దగా ఎవరు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు అడవి శేషు సినిమాతో ఈ ముద్దుగుమ్మ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. హీరోయిన్ గా బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు సౌత్ సినిమాలపై ఆసక్తి ఉండడంతో బాలీవుడ్ లో సౌత్ స్టార్ హీరోలతో నటించడానికి ఇక్కడ ప్రయత్నాలు చేస్తోంది అందులో భాగంగానే టాలీవుడ్ నుంచి వచ్చిన ఆఫర్లను వదులు కోకుండా నటించింది.
మేజర్ సినిమా సక్సెస్తో ఒక్కసారిగా సాయి మంజ్రేకర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఏడాది చివరి వరకు రెండు మూడు సినిమాలు తెలుగులో చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అడవి శేషు తో కలసి కాలేజ్ అమ్మాయి లవర్ గా భారీగా ఇలా అన్ని వేరియేషన్ లో కూడా నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. కేవలం అందం తో మాత్రమే కాకుండా తండ్రి వారసత్వం పుణికి పుచ్చుకున్నట్లు గా మంచి నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది సాయి మంజ్రేకర్. టాలీవుడ్ అప్ కమింగ్ హీరోయిన్ గా నిలవడం ఖాయం అంటూ పలువురు నెటిజన్లు  అభిప్రాయాలను తెలియ జేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: