టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరైన బోయపాటి శ్రీను గురించి సినీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బోయపాటి శ్రీను రవితేజ హీరోగా తెరకెక్కిన భద్ర సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా భద్ర తోనే బ్లాక్ బస్టర్ విజయం బాక్సాఫీస్ దగ్గర అందుకున్న బోయపాటి శ్రీను మొదటి సినిమా తోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ దర్శకుడిగా మారిపోయాడు. భద్ర సినిమా తర్వాత తులసి , సింహ , దమ్ము , లెజెండ్ , సరైనోడు , జయ జానకి నాయక , వినయ విధేయ రామ , అఖండ సినిమాలకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు.
ఈ సినిమాలలో జూనియర్ ఎన్టీఆర్ తో తెరకెక్కించిన దమ్ము , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తెరకెక్కించిన వినయ విధేయ రామ సినిమాలను మినహాయిస్తే మిగతా సినిమాలు అన్నీ కూడా మంచి విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన అఖండ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఏ సినిమాలో బాలకృష్ణ హీరోగా నటించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బోయపాటి శ్రీను , రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇది ఇళ్ళు ఉంటే తాజాగా బోయపాటి శ్రీను తనకు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక సినిమాను తెరకెక్కించాలని ఉంది అని తెలియజేశాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక సినిమాను తెరకెక్కించడం నాకు కళ అని బోయపాటి శ్రీను తాజాగా తెలియజేశాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు అవకాశమిస్తే సూపర్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేస్తానని, మహేష్ బాబు తో సినిమా చేయడం నా కళ అంటూ బోయపాటి శ్రీను చెప్పుకొచ్చారు.