కేజీఎఫ్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. ఎన్టీఆర్ వల్లే ఇలా ఉన్నానంటూ..!?

N.ANJI

ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా.. వినిపిస్తున్న పేరు ప్రశాంత్ నీల్. ఇటీవల విడుదలైన కేజీఎఫ్-2 సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలైన ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఇది వరకే విడుదలైన కేజీఎఫ్ ఫస్ట్ చాప్టర్ మంచి హిట్ అందుకోగా.. దీని సీక్వెల్‌లో విడుదలైన కేజీఎఫ్-2 భారీ విజయాన్ని నమోదు చేసుకుంటోంది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు గట్టి పోటీ ఇస్తోంది.


కేజీఎఫ్-2 సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఇందులోని కొన్ని సన్నివేశాలు, ఎలివేషన్స్ ప్రేక్షకులను గూస్‌బంస్స్ తెచ్చేలా ఉంటాయి. తల్లి సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూనే.. భారీ ఎలివేషన్స్ తో నీల్ చూపించిన ప్రాధాన్యం ఈ సినిమాను వేరే లెవల్‌కు తీసుకెళ్లాయి. అయితే ఇటీవల ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూకి హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.


కేజీఎఫ్-2 మంచి హిట్ అందుకోవడంతో ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఆ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే తన తర్వాతి సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను తెలియజేశారు. తన నెక్ట్స్ సినిమాలన్నీ తెలుగు హీరోలతోనే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే రెబల్ స్టార్ ప్రభాస్‌తో సలార్ షూటింగ్‌లో బిజీ ఉన్న ఈ డైరెక్టర్.. తన తర్వాతి సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఉండనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఎన్టీఆర్ కోసం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక ఆటంబాంబ్ లాంటి కథను రెడీ చేసినట్లు సమాచారం.


అయితే కన్నడ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్‌లో సినిమాలు చేయడానికి ఎన్టీఆరే ముఖ్య కారణమని నీల్ చెప్పుకొచ్చారు. కేజీయఫ్-1 సినిమా తీసినప్పుడు అందరికంటే ముందుగా ఎన్టీఆరే తనను అభినందించిన్నట్లు ఆయన పేర్కొన్నారు. సినిమా చాలా బాగుందని సపోర్ట్ ఇచ్చారని తెలిపారు. తనపై చూపించిన ప్రేమను తాను ఎప్పటికీ మరచిపోలేనని ప్రశాంత్ నీల్ చెప్పారు. ఎన్టీఆర్ తర్వాత మహేష్ బాబు కూడా తనను మెచ్చుకున్నాడన్నారు. ఇంత మంది హీరోల ప్రేమను చూసి.. టాలీవుడ్ హీరోలంటే తనకు గౌరవం పెరిగిందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: