వర్మ.. నీ పాపం పండే రోజు దగ్గర్లో ఉందంటున్న నట్టికుమార్.. కారణం..!!

Divya
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ.. డిస్ట్రిబ్యూటర్ నిర్మాత నట్టికుమార్ మధ్య గత కొన్ని నెలల నుంచి వివాదం జరుగుతూనే ఉన్నది. ఆర్జీవి తనను మోసం చేశాడంటూ నట్టికుమార్ కోర్టుకు వెళ్లడం కూడా జరిగింది. ఇక వర్మ తీసిన డేంజరస్ సినిమాని విడుదల కాకుండా అడ్డుకుంటున్నారు. వర్మ ఓ వీడియోను విడుదల చేసినట్టు నట్టి కుమార్ సంగతి చూస్తా కోర్టులో తేల్చుకుంటాం అంటూ ఒక వీడియో ద్వారా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక దాంతో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో మరింత దుమారం రేపుతోంది.
అయితే నకిలీ డాక్యుమెంట్లు ద్వారా తన చిత్రాన్ని అడ్డుకున్నాడు అంటూ నట్టికుమార్ పై ఆర్జివి పరువు నష్టం దాకా వేయడం జరిగింది. ఇక అంతే కాకుండా క్లియరెన్స్ ఆర్డర్ కూడా వచ్చింది.. దీంతో డేంజరస్ చిత్రాన్ని మే 6వ తేదీన విడుదల చేయడానికి ప్రకటించారు. ఇక నట్టి క్రాంతి - నట్టి కరుణ ల  మీద ఫోర్జరీ కేసు కాకుండా కొన్ని మీడియా ఛానల్ ద్వారా వేసిన నిందలు ఆరోపణలకు సంబంధించిన వాటిని తీసుకొని సత్యనారాయణతో కలిసి కోర్టులో కేసు వేస్తున్నట్లుగా వర్మ తెలియజేయడం జరిగింది. నాలుగు జెర్రీ డాక్యుమెంట్ ను ఉపయోగించి తన సినిమానే ఆర్ధిక నష్టం కలిగించేందుకు సిద్ధమయ్యారని వర్మ తెలియజేస్తున్నారు.
కేవలం ఈ విషయాన్ని ఒక ప్రెస్ నోట్ ద్వారా తెలియజేశారు వర్మ. ఇక ఇంతకు మించి నేను ఏమీ మాట్లాడను వారికి చట్టపరమైన చర్యలు తీసుకోవడం పైన దృష్టి పెడతానని తెలియజేశారు. అతి త్వరలోనే వాళ్లకు సంబంధించిన అన్ని విషయాలు బయట పెడతానని ఆర్జీవి తెలిపారు. ఇక దీనిపై నట్టికుమార్ స్పందిస్తూ వర్మ ఆరోపణలను తీవ్రంగా ఖండించడం జరిగింది. ఇవన్నీ వర్మ రాసిచ్చిన డాక్యుమెంట్స్ లీగల్ గానే తేల్చుకుంటామని తెలియజేశారు. కేవలం మీరిద్దరూ ఆడుతున్న నాటకాలు ఎవరికీ తెలియకపోవచ్చు .. ఎప్పటికైనా నిజాలు బయటికి వస్తాయి అని తెలియజేశారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: