మెగాస్టార్ ఫ్యాన్స్ కి మెగా సర్ప్రైజ్!

Purushottham Vinay
ఇక `సైరా నరసింహారెడ్డి తరువాత చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన `ఆచార్య`సినిమా ఏప్రిల్ 29న విడుదలకు రెడీ అవుతుంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు కూడా స్పీడప్ చేసేశారు.ఈ సినిమా విడుదలకి రెడీ అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం చేస్తున్న మరో నాలుగు సినిమాల షూటింగ్ ల విషయంలో స్పీడు పెంచేశారు. క్రేజీ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి 17 ఏళ్ల తరువాత సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారట. ఇక వివరాల్లోకి వెళితే.. గతంలో మెగాస్టార్ చిరంజీవి తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసి ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇన్నేళ్ల విరామం తరువాత మరోసారి తండ్రి కొడుకులుగా మెగాస్టార్ చిరంజీవి కనిపించి  మళ్ళీ సర్ ప్రైజ్ చేయబోతున్నారట.ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటించిన `ఆచార్య` సినిమా విడుదలవుతుండగా మరో నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు చిరంజీవి. ఇందులో మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న `భోళా శంకర్` సినిమా షూటింగ్ దశలో వుంది. తమిళ బ్లాక్ బస్టర్ సినిమా `వేదాలం` ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక తమిళ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్షన్ లో `గాడ్ ఫాదర్` చేస్తున్నారు. దీనికి మలయాళ హిట్ సినిమా `లూసీఫర్` ఆధారం. ఈ సినిమా కూడా షూటింగ్ దశలో వుంది.


ఈ సినిమాలతో పాటు బాబీ డైరెక్ట్ చేస్తున్న చిత్రంలోనూ నటిస్తున్నారు చిరంజీవి. మైత్రీ మూవీమేకర్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా కూడా షూటింగ్ దశలో వుంది. `వాల్తేరు వీరయ్య` అనే టైటిల్ ని ఇప్పటికే ఈ సినిమాకి ఫైనల్ చేశారు. మాస్ మహారాజా రవితేజ కీలక అతిథి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో చాలా ఏళ్ల తరువాత చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అది కూడా తండ్రీ కొడుకులుగా చేస్తున్నారని తెలిసింది.2005లో శ్రీను వైట్ల రూపొందించిన `అందరివాడు` సినిమాలో చిరు తండ్రీ కొడుకులుగా నటించారు. మళ్లీ ఇన్నేళ్లకు బాబి రూపొందిస్తున్న సినిమాలో చిరంజీవి తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నారట. గతంలో శివుడు శివుడు శివుడు బిల్లా రంగా రోషగాడు సింహపురి సింహం జ్వాల సినిమాల్లో తండ్రీ కొడుకులుగా నటించి ఆకట్టుకున్నారు.ఇక కోడి రామకృష్ణ తెరకెక్కించిన `రిక్షావోడు` సినిమా ఎ.ఎస్. రవికుమార్ డైరెక్ట్ చేసిన `స్నేహం కోసం సినిమా ` శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన `అందరివాడు` సినిమాలో తండ్రీ కొడుకులుగా కనిపించి ఆకట్టుకున్న చిరంజీవి మళ్లీ ఇన్నేళ్ల తరువాత తండ్రి కొడుకులుగా `వాల్తేరు వీరయ్య`సినిమాలో కనిపించబోతుండటం విశేషం. ఇక మెగా ఫ్యాన్స్ కి పండగే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: