ఉదయ్ కిరణ్ తో కలసి నటించడం వారికి శాపమా..?

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే ఎంతో మంది ప్రేక్షకులలో  చెరగని ముద్ర వేసుకున్న హీరోలలో ఉదయ్ కిరణ్ కూడా ఒకరు. ఇకపోతే ఆయన మరణించి సినీ ఇండస్ట్రీకి శోకం  మిగిల్చిన ఈయనతో నటించిన వారు కూడా చనిపోయారు అని తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే. నిజానికి ఉదయ్ కిరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో తెరకెక్కిన నువ్వు నేను చిత్రం 2001 లో విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలవడమే కాకుండా కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
ఈ సినిమాతో పాటు ఉదయ్ కిరణ్ కి అలాగే హీరోయిన్  కి కూడా మంచి పేరు లభించిందని చెప్పవచ్చు. ఈ సినిమా ద్వారా విమర్శించే వారి నుంచి ప్రశంసలు కూడా అందుకున్నాడు ఉదయ్ కిరణ్. అలాగే ఎన్నో అవార్డులను,  రివార్డులను సైతం సొంతం చేసుకుంది ఈ సినిమా.. తెలుగు ఫిలిం ఫేర్ అవార్డులను కూడా సొంతం చేసుకుంది నువ్వు నేను సినిమా. ఈ సినిమాలో నటించిన ఎంతోమంది నటీనటులు ఇప్పుడు మన ముందు లేరు అని తెలిస్తే మాత్రం షాక్ అవ్వక మానరు. ఇక ముందుగా ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకొని మరణించగా,  ఎమ్మెస్ నారాయణ కూడా అనారోగ్య సమస్యతో మరణించారు.
ఆహుతి ప్రసాద్ కూడా అనారోగ్య సమస్యతో మరణించగా ధర్మవరపు సుబ్రమణ్యం కూడా మరణించడం బాధాకరమని చెప్పవచ్చు. ఈ సినిమాలో హీరో తండ్రి పాత్రలో నటించిన వైజాగ్ ప్రసాద్ కూడా మరణించారు.హీరోయిన్ ఆర్తి అగర్వాల్ ఉదయ్ కిరణ్ తో కలిసి వేరొక సినిమాలు నటించగా..ఆమె కూడా ఆత్మహత్య చేసుకొని మరణించింది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన వారందరూ కూడా మృతి చెందడం బాధాకరమని చెప్పవచ్చు. ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా వీ ఈ సినిమా శాపమా అంటూ తమ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: