వైరల్ ఫోటో: ఈ చిన్నారులను గుర్తు పట్టారా..? ప్రస్తుతం వీరిద్దరూ స్టార్ హీరోలు..!

N.ANJI

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు చిన్నారులను చూశారా..? చూడటానికి ఎంతో ముద్దుగా కనిపిస్తున్న ఈ చిన్నారులు ప్రస్తుతం స్టార్ హీరోలు. పవర్ ఫుల్ యాక్షన్ సినిమాలు చేయడంలో.. లవర్ బాయ్స్ గా అమ్మాయిలను ఆకట్టుకోవడంలో వీరికి వీరే సాటి. సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ చిన్నారులిద్దరికీ ఫ్యాన్ ఫాలొయింగ్ ఎక్కువే. ఇంతకీ ఈ ఫోటోలో ఉన్నది ఎవరనే విషయాన్ని కనిపెట్టారా..? అతి తక్కువ సమయంలో తమిళ సినీ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుని.. అదే లక్‌తో టాలీవుడ్‌లోనూ విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ఇటీవల విడుదలైన వీరి సినిమాలు సైతం బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి.



సోషల్ మీడియాలో కరోనా లాక్‌డౌన్ పీరియడ్ నుంచి త్రోబ్యాక్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. సెలబ్రిటీలు తమకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఆ ఫోటోలు వైరల్ అవడంతో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఎవరని గుర్తించేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇలాంటి క్రమంలోనే ఈ ఇద్దరు అన్నదమ్ముల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.



ఈ ఫోటోలు కనిపిస్తున్న చిన్నారులు మరెవరో కాదు.. తమిళ సూపర్ స్టార్స్ సూర్య-కార్తీ. తమిళ ఇండస్ట్రీతోపాటు తెలుగు ఇండస్ట్రీలోనూ వీరిద్దరికి ఫ్యాన్ ఫాలొయింగ్ అధికంగా ఉంటుంది. వీరిద్దరి సినిమాలు తెలుగులో డబ్ అయిన బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాయి. ఇటీవల సూర్య నటించిన ‘జై భీమ్’ సినిమా ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత సూర్య ‘ఈటీ’ సినిమాలో నటించారు. అలాగే హీరో కార్తీ నటించిన సుల్తాన్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కాగా కార్తీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం ఆయన ‘సర్దార్’ సినిమాలో నటిస్తుండగా.. హీరోయిన్‌గా రాశీఖన్నా నటిస్తోంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: