ఉపేంద్ర తో ఆర్జివి సినిమా ఇందులో నిజమెంత..!!

Divya
తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే కోయిలమ్మ సీరియల్ లో తేజస్విని అంటే గుర్తు పట్టని వారంటూ ఎవరూ ఉండరు. ఈమె కన్నడ బ్యూటీ అయినప్పటికీ తెలుగులో మంచి అవకాశాలను చేజిక్కించుకుంది. అంతేకాకుండా సీరియల్స్ లో తన చక్కటి అందం అభినయంతో ప్రేక్షకులను బాగానే మూటగట్టుకుంది. అయితే తాజాగా తేజస్విని గౌడ స్టార్ మా లో ప్రసారం అవుతున్న c/o అనసూయ అనే నాటికలో నటిస్తున్నది. ఇందులో శివాని పాత్రలో ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. అయితే తాజాగా ఒక ప్రోగ్రామ్ కి వచ్చిన ఈమె ఎమోషనల్ అవుతూ తన కు జరిగిన కొన్ని ఇబ్బందుల గురించి తెలియజేసింది వాటి గురించి చూద్దాం.

తాజాగా స్టార్ మా లో ప్రసారం అవుతున్న స్టార్ మా పరివార్ లో తేజస్విని గౌడ పాల్గొంది. ఈమెతో పాటు c/o అనసూయ నాటిక లో నటించే వారు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అందరూ కలిసి డాన్సులు, పాటలతో బాగా రచ్చరచ్చ చేశారు. అయితే అటు తర్వాత తమ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు. ఇక తేజస్విని గౌడ తన తండ్రి చివరి చూపు కూడా చూసుకోలేక పోయాను అని ఎమోషనల్ అయ్యింది.
తను కేవలం ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే తన తండ్రి మరణించారని.. ఆ సమయంలో తన తండ్రిని చూడడానికి రాత్రివేళ సమయంలో జర్నీ చేసి వచ్చినా కూడా ఆఖరి చూపులు చూసుకోలేక పోయాను అని తెలిపింది. తన ఇంటికి వెళ్లే సమయానికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారని.. తన తండ్రి చివరి చూపు కూడా నోచుకోలేక పోయాను అని చాలా బాధపడింది. తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తెలియకుండానే పెరిగానని, తన తల్లి మరణించేవరకు కూడా ఆమె లోనే తన తండ్రిని చూసుకున్నాను అని తెలిపింది. ఇక ఇవే కాకుండా తన జీవితంలో ఎన్నో కోల్పోయానని కన్నీటి పర్యంతం అయ్యింది తేజస్విని గౌడ. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: