ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' కోసం రంగంలోకి ఆనంద్ మహేంద్ర..!

Anilkumar
టాలీవుడ్ లో ఇటీవల మహానటి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో 'ప్రాజెక్ట్ K' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే.  సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొంత షూటింగ్ కూడా జరిగింది. ఇటీవల బిగ్ బి అమితాబ్ బచ్చన్ మరియు ప్రభాస్ లపై కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారు.ఇదిలా ఉంటె ఇటీవల తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్.. ఆనంద్ మహీంద్రాను రిక్వెస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.

ఇక అది ఏంటంటే 'డియర్ ఆనంద్ మహీంద్రా సార్.. భారతీయ భాషల్లో సైన్స్ ఫిక్షన్ 'ప్రాజెక్ట్ k'ను అత్యంత భారీ బడ్జెట్‌తో అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికలతో రూపొందిస్తున్నాం. అంతేకాదు ఈ సినిమా కోసం పూర్తిగా ఒక   కొత్త ప్రపంచాన్ని మేము సృష్టించడం జరిగింది. అయితే ఈ సినిమా కోసం మేము భారీ వాహనాలను తయారు చేయవలసి వచ్చింది.ఇకపోతే అవి నేటి సాంకేతికతకు మించి మరెన్నో ప్రత్యేకతలతో కూడుకొని ఉంటాయి.ఎందుకంటె  ఈ సినిమా అద్భుతంగా కుదిరితే.. అది మన దేశానికే గర్వకారణమవుతుంది. అంతేకాకుండా మాలో ప్రతిభావంతులైన వ్యక్తులు ఇంజినీర్లు అత్యుత్తమ డిజైనర్‌లు ఉన్నారు.

అయితే ఎవరు ఊహించని విదంగా , ఈ సినిమా అత్యంత భారీ స్థాయిలో రూపొందుతోంది.ఇకపోతే  దీనికి మీ సహకారం కావాలి' అని రాసుకొచ్చారు. కాగా చూసిన ఆనంద్ మహీంద్రా.. 'ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఎలా తిరస్కరిస్తాం నాగ్ అశ్విన్..?ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరో రోల్ లో కనిపించబోతున్నారు. అయితే ఇటీవలే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇదిలావుండగా రీసెంట్ గానే అమితాబ్, దీపికా సినిమా షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొన్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమాని గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: